YSRCP: రాజకీయ నాయకులు తమ ఎన్నో కలలు కంటుంటారు. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఏన్నో ప్రయత్నాలు, లాబీయింగ్ లు చేస్తారు. కొందరికి మాత్రం పదవులు అనూహ్యంగా వరిస్తుంటాయి. కొందరికి ప్రయత్నంలో లోపం లేకున్నా కల నెరవేరే పరిస్థితి ఉండదు. సాధారణంగా రాజకీయాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గా ఎన్నికైన అధికార పార్టీ నాయకులకు మంత్రి పదవి పొందాలన్న కోరిక ఉంటుంది. కానీ కోరిక ఉన్న ప్రతి ఒక్కరికి మంత్రి పదవి లభించదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ముద్రపడిన సినీ నటి ఆర్కే రోజాకు ఈ సారి కూడా జగన్ ఝలక్ ఇస్తారన్న టాక్ నడుస్తోంది. కులాలు, ప్రాంతాల ఈక్వీషన్ ల నేపథ్యంలో జగన్ ఈ ఫైర్ బ్రాండ్ నాయకురాలికి మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నారు.
Read More: YSRCP: సీఎం జగన్ ను ఆ మాజీ ఎంపీ కలిసింది అందుకేనా? విజయసాయికి రెన్యువల్ ఉన్నట్లా..? లేనట్లా?
YSRCP: మంత్రి పదవి ఖాయం అనుకుంటే..?
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు వైసీపీ తరపున ఆర్ కే రోజా ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. 2014లో రోజా పార్టీ కోసం విస్తృతంగా పని చేశారు. గత టీడీపీ హయాంలో అసెంబ్లీలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడంతో ఏడాది పాటు సస్పెన్షన్ కు కూడా గురైయ్యారు. వైసీపీ తరపున గెలిచిన అనేక మంది ఎమ్మెల్యేలు అధికార టీడీపీ గూటికి చేరినా రోజా పార్టీ పట్ల అంకితభావంతో పని చేస్తూ పార్టీ వాణిని గట్టిగా వినిపించారు. టీడీపీ ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేస్తూ జగన్ వద్ద మంచి మార్కులే తెచ్చుకున్నారు. ఇక 2019లో రెండవ సారి ఎమ్మెల్యే కావడం, వైసీపీ అధికారంలోకి రావడంతో రోజాకు మంత్రి పదవి ఖాయమని అందరూ అనుకున్నారు. ఆమెకు మంత్రి పదవి ఖాయమనే భావించారు. కానీ చిత్తూరు జిల్లా నుండి సీనియర్ నేత, వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డితో పాటు ఎస్సీ కోటాలో నారాయణ స్వామికి మంత్రి వర్గంలో స్థానం ఇవ్వడంతో రోజా నిరుత్సాహానికి గురైయ్యారు. వైసీపీ పట్ల అలక బూనిన నేపథ్యంలో కొద్ది రోజుల తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో కొంత మేర శాంతించారు. అయితే ఆ పదవీ మూడునాళ్ల ముచ్చటే అయ్యింది. ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టకూడదని తీసుకున్న నిర్ణయంలో భాగంగా రోజా ఆ పదవీ వదులుకోవాల్సి వచ్చింది.
ఈ సారి కూడా రోజాకు బ్యాడ్ లక్ యేనా..?
అయితే ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళన జరగనున్న సంగతి తెలిసిందే. జగన్మోహనరెడ్డి గతంలో చెప్పిన ప్రకారం ఇప్పటికే మంత్రివర్గ ప్రక్షాళన జరగాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఉగాది పండుగ తర్వాత మంత్రి వర్గ ప్రక్షాళన జరుగుతుందని వార్తలు వినబడుతున్నా ఈ సారి కూడా రోజాకు అవకాశం కష్టమేనని అంటున్నారు. అందుకు కారణం ఏమిటంటే.. జిల్లాల విభజన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పరిధిలో చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, జీడీ నెల్లూరు. పూతలపట్టు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పుంగనూరు నుండి ప్రాతినిత్యం వహిస్తున్న సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా నుండి మంత్రిగా ఉన్నారు. మంత్రివర్గం నుండి ఆయనను తొలగించే అవకాశాలు లేవు. రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగిరి నియోజకవర్గం కూడా చిత్తూరు జిల్లాలోనే ఉండటంతో ఈ సారి కూడా రోజాకు బ్యాడ్ లక్ తప్పదని అనుకుంటున్నారు.