LIC: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం అయినటువంటి LIC ఇటీవల IPO గురించి ప్రస్తావన తెచ్చింది. ఇక అప్పటినుండి ఈ IPO పట్ల మార్కెట్లో అమితంగా ఆసక్తి ఏర్పడింది. తాజాగా దీనిని ఉద్దేశించి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో మంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఇష్యూ జారీకి మార్కెట్ పరిస్థితి అనుకూలంగా ఉంటుందా అనే ఆందోళన తమకు ఉందని అనడం కొసమెరుపు.
LIC పాలసీదారులారా టెన్షన్ పడకండి.. సదరు పాలసీలను రెన్యువల్ చేసుకునే అవకాశం వుంది!
LIC: పెట్రో సుంకాలు తగ్గుదల:
రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తల కారణంగా ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న క్రూడ్ ధరలను తాము గమనిస్తూ ఉన్నామని సీతారామన్ చెప్పారు. క్రూడ్ పెరుగుతున్నందున, ప్రభుత్వం పెట్రో, డీజిల్ సుంకాల్ని కూడా తగ్గించే వెసులుబాటు ఉందని ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి అన్నారు. ఈ క్రమంలో ఇటీవల సెబీ జారీచేసిన ఉత్తర్వుల్ని ప్రస్తావించగా, ఈ కేసులో నియంత్రణాపరమైన చర్యలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే అంశంపై అప్పుడే మాట్లాడలేమని అన్నారు.
LIC: మీకు LIC పాలిసీ వుందా? అయితే ఈ సువర్ణావకాశం మీదే!
చైనా యాప్స్:
ఇకపోతే భారత వ్యాపారంపై రష్యా-ఉక్రెయిన్ ప్రభావం లేకపోలేదని, ఇలాంటి సమయాలలో ఆచితూచి అడుగు వేయాలని అభిప్రాయపడ్డారు. చైనా మొబైల్ యాప్ల్ని నిషేధించడం వల్ల ఇరు దేశాల వాణిజ్యంపై ఎటువంటి ప్రభావం పడలేదని సీతారామన్ అన్నారు. ఈ యాప్ల నిషేధంపై నిర్ణయం ద్వైపాక్షిక వాణిజ్యానికి ముడిపెట్టింది కాదని, కొన్ని కోణాల్లో అవి హానికరమని భావించినందునే తాము యాప్ల్ని నిషేధించామని, అది వ్యాపారంపై ఎటువంటి ప్రభావం చూపలేదన్నారు.