నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావటంతో రెండు తెలుగు రాష్ట్రాలలో సందడి వాతావరణం నెలకొంది. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలించక పోవటంతో.. ఈసారి బయట వాతావరణం సానుకూలంగా ఉండటంతో భారీ ఎత్తున పవన్ జన్మదిన వేడుకలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన “తమ్ముడు” మరియు “జల్సా” సినిమాల స్పెషల్ షోస్…పడ్డాయి. ఆగస్టు 31వ తారీకు నుండే పవన్ కెరియర్ లో సూపర్ హిట్ అయినా సినిమాలు వేయడం జరిగింది.
ఇదిలా ఉంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ కి అన్నయ్య చిరంజీవి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. “తన ఆశ, ఆశయం ఎప్పుడు జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో.. చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలని నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనీ పవన్ తో దిగిన పాత ఫోటో…చిరు పోస్ట్ చేయడం జరిగింది.
అంతకుముందే “ఫస్ట్ డే ఫస్ట్ షో” ఫ్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా వచ్చిన సమయంలో కూడా వేదికపై పవన్ కి ముందుగానే చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి మాత్రమే కాదు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు .. ఇంకా పలువురు సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు పవన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక “జల్సా” 4K ప్రింట్ తో హైదరాబాద్ లో స్పెషల్ షో లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అభిమానులతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశారు. సినిమాలో యాక్షన్ సీన్స్ రాగానే.. అభిమానులతో పాటు సాయి ధరమ్ తేజ్ పేపర్లు విసురుతూ రచ్చ రచ్చ చేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.