NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏపి పరిపాలనా రాజధాని మూహూర్తం ఫిక్స్ అయినట్లే(గా)..! ఎప్పుడంటే..?

Visakha ap administrative capital?

ఏపిలో రాజధాని అంశానికి సంబంధించి పీట ముడి వీడలేదు. రాజధాని పై ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపి సర్కార్ సుప్రీం కోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ ఎల్ పీ ) విచారణ కొనసాగుతోంది. హైకోర్టు అదేశాల్లో పలు అంశాలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. రాష్ట్ర రాజధాని అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందా లేదా అన్నదానిపై సుప్రీం కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది అన్నది ఆసక్తికరంగా, ఉత్కంఠగా ఉండగా, వైసీపీ పెద్దలు మాత్రం.. తమ పార్టీ, ప్రభుత్వ నిర్ణయం పరిపాలనా వికేంద్రీకరణేనని స్పష్టం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా ఇతర రాజకీయ పక్షాలు అన్నీ అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటుపై కృతనిశ్చయంతో ఉంది.

Visakha ap administrative capital?
Visakha ap administrative capital?

 

తాజాగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలనా రాజధానిగా విశాఖ ఏర్పాటునకు మూహూర్తం ఖరారు అయినట్లుగా ఆయన మాట్లాడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మరో రెండు నెలల్లో విశాఖ ఏపికి పరిపాలనా రాజధాని కాబోతున్నదని స్పష్టం చేశారు. గతంలో సీఆర్డీఏ రద్దు చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ చట్టం రద్దు చేసిన సమయంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి .. పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించి మెరుగైన బిల్లు తీసుకువస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఫిబ్రవరి మాసంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి బిల్లులను తీసుకువచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

AP Minister Gudivada Amarnath Three capitals
AP Minister Gudivada Amarnath Three capitals

 

శాసనసభ, శాసన మండలిలో బిల్లుల ఆమోదం పొందిన వెంటనే విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు ప్రక్రియను ప్రారంబించే అవకాశం ఉంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టే అవకాశం ఉండటం వల్లనే మంత్రి గుడివాడ అమరనాథ్ రెండు నెలల్లో విశాఖ పరిపాలనా రాజధాని కాబోతుందని ప్రకటించారని అనుకుంటున్నారు. అయితే సుప్రీం కోర్టులో రాజధానికి సంబందించి పిటిషన్లపై విచారణ జరుగుతుండగా, తీర్పు వెలువడకముందే రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.

AP CM YS Jagan

 

ఒక వేళ కోర్టు తీర్పు ఆలస్యం అయితే గతంలో తమిళనాడులో సీఎం జయలలిత హయాంలో పరిపాలన సాగించిన విధంగా ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రెండు నెలల్లో తన క్యాంప్ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసుకుని అక్కడి నుండే పరిపాలన సాగించే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయాన్ని ఎక్కడ పెట్టుకుని అయినా పరిపాలనా సాగించే అవకాశం ఉంటుంది. దీనికి న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురు అయ్యే అవకాశం ఉండదు. ముందుగా సీఎం క్యాంప్ కార్యాలయంలో విశాఖలో ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలకు పరిపాలనా రాజధాని విశాఖ అవుతుందన్న భరోసా ఇచ్చిన్నట్లు కూడా అవుతుంది. ముఖ్యమంత్రి జగన్ మదిలో ఏమి ఉన్నదో.. ? ఏమి జరుగుతుందో చూడాలి మరి..!

జగన్ సర్కార్ కీలక నిర్ణయం .. వారి పదవీ కాలం పొడిగింపు

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju