ఏపిలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీల అభివృద్ధి కోసం 2020లో రాష్ట్రంలోని 139 బీసీ కులాలకు గానూ 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు, డైరెక్టర్ల ను నియమించిన సంగతి తెలిసిందే. కార్పోరేషన్ పాలకవర్గ పదవీ కాలం ముగుస్తున్నందన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తాజాగా ప్రభుత్వం బీసీ కార్పోరేషన్ చైర్మన్ ల పదవీ కాలం పొడిగించింది. 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్ల పదవీ కాలం పొడిగిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ గడువు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. చైర్మన్, డైరెక్టర్ ల పదవుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించిన సంగతి తెలిసిందే.
PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు.. ఎప్పుడంటే..?