`అమర్ అక్బర్ ఆంటోని` తర్వాత మాస్ మహారాజా రవితేజ .. గ్యాప్ తీసుకున్నాడు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ సినిమాయే `డిస్కోరాజా`. రామ్ తాళ్లూరి నిర్మాత. స్క్రిప్ట్ విషయంలో ఏటూ తేలకపోవడంతో సినిమా ఇంత వరకు స్టార్ట్ కానే లేదు. ఈలోపు సినిమా బడ్జెట్ విషయంలో హీరో రవితేజకు, నిర్మాత రామ్ తాళ్లూరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని వినికిడి. దీంతో రవితేజ ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడట. అయితే నిర్మాత రామ్ తాళ్లూరికి సన్నిహితుడైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారట.
previous post
next post