ఈ మధ్య రీల్ లైఫ్ జోడీలు రియల్ లైఫ్లో కూడా జోడీ కడుతున్నారు. ఇప్పుడు అదే కోవాలో చేరింది సాయేషా సైగల్… అఖిల్ సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటి. ఈ సినిమా ప్లాప్ కావడంతో ఎంట్రీతోనే షాయేషాకు ఎదుకు దెబ్బ తగిలింది. అయితే సినిమా ప్లాప్ అయిన అమ్మడి గ్లామర్ మంచి మార్కులే పడ్డాయి. అయినా కూడా తెలుగులో మరో సినిమా చేసే ఛాన్స్ రాలేదు. దీంతో కోలీవుడ్కు షిప్ట్ అయిన షాయేషాకు అక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఇటీవలే కార్తీతో చినబాబు సినిమాలో నటించింది. ఈ సినిమా తమిళ్లో మంచి హిట్గా నిలిచింది. గ్లామర్తో తమిళ తంబిలను అట్రాక్ట్ చేస్తున్న ఈ బ్యూటీ. వరుస అవకాశాలు అందుకుంటు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుంది. అయితే కెరీర్ పికాఫ్ అందుకుంటున్న టైంలో ఓ యంగ్ హీరోతో ప్రేమాయాణం నడిపిస్తోందట. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చెన్నై వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుగులో సూపర్ హిట్ అయిన భలే భలే మగాడివోయ్ సినిమాని తమిళ్లో గజనీకాంత్ పేరుతో రీమేక్ చేశారు . ఈ సినిమాలో ఆర్య , సాయేషా జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ టైంలోఈ ఇద్దరు ప్రెండ్ షిప్ మొదలైంది. ఇప్పుడు ఆ ప్రెండ్ షిప్ కాస్త పెరిగి ప్రేమగా మారిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరు కాప్పాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఫారెన్ ఓ షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఆ షెడ్యూల్లో గ్యాప్ దొరికినప్పుడలా షాఫింగ్, షికార్లంటు చెట్టాపట్టాలేసుకొని తిరిగారని టాక్ వినిపిస్తోంది… కాప్పాన్ సినిమా కంట్లీట్ అయిన మూడు నెలల్లో పెళ్లి కూడా చేసుకొబోతున్నారట. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇద్దరి ప్రేమించుకుంటున్నారని గాసిప్ వస్తున్న ఇప్పటికి వీరిద్దరూ రియాక్ట్ కాకపోవడంతో, నిజంగానే లవ్లో ఉన్నారంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.