AP 10th Class Results: ఏపి పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. వాస్తవానికి పదవ తరగతి ఫలితాలను శనివారం నాడు విడుదల చేయాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల నేటికి వాయిదా పడింది. మొత్తం 6,15,908 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పరీక్షలు రాయగా వారిలో 4,14,281 మంది అత్తీర్ణులైనట్లు మంత్రి బొత్స తెలిపారు. ఉత్తీర్ణత శాతం తీసుకున్నట్లయితే బాలురు మొత్తం 3,16,820 మంది పరీక్షలు రాయగా 2,02,821 మంది (64.02 శాతం) ఉత్తీర్ణులైయ్యారని చెప్పారు. బాలికలు 2,99,088 మంది పరీక్షలు రాయగా 2,11,460 మంది (70.70 శాతం) పాసైనట్లు చెప్పారు.
- Read the latest news from
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 11,670 పాఠశాలల విద్యార్ధినీ విద్యార్ధులు పరీక్షలు రాసినట్లు మంత్రి చెప్పారు. 797 పాఠశాలల్లో విద్యార్ధులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించగా, 71 పాఠశాలలో ఒక్కరు కూడా (0 శాతం ఉత్తీర్ణత) పాస్ కాలేదన్నారు. ఏప్రిల్ 27 నుండి మే 9వరకు పరీక్షలు నిర్వహించగా, మే 13 నుండి ప్రశ్నాపత్రాల మూల్యాంకనం చేపట్టారు. పొరుగు రాష్ట్రాలకంటే ముందుగా ఫలితాలను వెల్లడించినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. రెండేళ్ల తర్వాత మొదటి సారిగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది. మొదటి సారిగా విద్యార్ధులకు మార్కులను ప్రకటిస్తున్నారు. ర్యాంకుల ప్రచారంపై ప్రభుత్వం నిషేదం విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.in లోకి లాగిన్ అయి విద్యార్ధులు తమ ఫలితాలు చూసుకోవచ్చు.