NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly Budget Session: అసెంబ్లీ సమావేశాల చివరి రోజూ టీడీపీ సభ్యుల నిరసన

Share

AP Assembly Budget Session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు శుక్రవారం కూడా టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి కల్తీ సారా మరణాలపై ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ సభలో నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళన మధ్యనే సభ్యుల ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. దేశ చరిత్రలో 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ దేనని వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఇదొక మహాయజ్ఞమని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. కావాలనే కొంత మంది కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు.

AP Assembly Budget Session TDP MLAs Protest
AP Assembly Budget Session TDP MLAs Protest

 

తొలుత మద్య నిషేదంపై మహిళలకు జగన్ రెడ్డి ఇచ్చిన హామీ గోవిందా గోవిందా అంటూ టీడీఎల్పీ నిరసన తెలిపింది. మహిళల తాళిబొట్లు తెంచారంటూ తాళిబొట్లు చేతపట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. 42 మంది మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ సచివాలయ అగ్నిమాపక కేంద్రం నుండి అసెంబ్లీకి నిరసన ర్యాలీ నిర్వహించారు. మృతుల ఫోటోలకు నివాళులర్పిస్తూ నల్ల కండువాలతో టీడీపీ నేతలు ప్రదర్శనలో పాల్గొన్నారు. కల్తీ సారా మరణాలు జగన్ రెడ్డి హత్యలేనని నినాదాలు చేశారు. మద్య నిషేదం అంటూ మహిళల మెడల్లో తాళ్లు తెంచుతున్నారంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కల్తీ సారా బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.


Share

Related posts

Vijay Deverakonda: బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఆ హీరోనే తనకు ఇన్స్పిరేషన్ అంటున్న విజయ్ దేవరకొండ..!!

sekhar

జగన్ కి షాక్ ఇచ్చిన మరొక ఎంపీ .. రఘురామ కంటే పెద్ద షాక్ ఇది ? 

sekhar

శ్రీలంక సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు – మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరులకు ట్రావెల్ బ్యాన్

somaraju sharma