NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CID: మార్గదర్శి కేసులో శైలజా కిరణ్ ను మరో సారి విచారిస్తున్న ఏపీ సీఐడీ

AP CID Officials investigating sailaja kiran On Margadarsi Case
Advertisements
Share

AP CID: మార్గదర్శి కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఏపీ సీఐడీ అధికారుల బృందం జూబ్లీహిల్స్ లోని రామోజీరావు నివాసానికి వెళ్లింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఎండీ శైలజా కిరణ్ ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. చందాదారుల నగదును ఎక్కడికి మళ్లించారు అన్న కోణంలో ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తొంది. చిట్ ఫండ్ నగదును రామోజీ గ్రూప్ కంపెనీలకు మళ్లించినట్లుగా సీఐడీ అధికారులు పేర్కొంటున్నారు. మార్గదర్శి కేసులో ఇప్పటికే ఆ సంస్థకు సంబంధించి రూ.798.50 కోట్ల విలువైన ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది. ఇంతకు ముందు కూడా సీఐడీ బృందం.. రామోజీరావు, శైలజా కిరణ్ లను విచారించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురుని ఏపీ సీఐడీ అరెస్టు చేయగా, యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, మద్యంతర ఉత్తర్వులు న్యాయస్థానం జారీ చేసింది.

Advertisements
AP CID Officials investigating sailaja kiran On Margadarsi Case
AP CID Officials investigating sailaja kiran On Margadarsi Case

 

మరో పక్క మార్గదర్శ చిట్ ఫండ్స్ నిధుల దారి మళ్లింపు కేసులకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్లను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ, సిద్ధార్ధ లుత్రాలు వాదనలు వినిపించగా, ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇతరత్రా అంశాలపై తదుపరి విచారణలో పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.

Advertisements

AP CM YS Jagan Polavaram Tour: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం వైఎస్ జగన్


Share
Advertisements

Related posts

టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావులకు సెక్యూరిటీ ఉపసంహరణ

somaraju sharma

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి టికెట్ ధరల పెంపునకు ఏపి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ..ట్విస్ట్ ఏమిటంటే..?

somaraju sharma

Sai pallavi: ఈసారి క్రెడిట్ మొత్తం నానికే..ఫిదా చేయలేకపోయిన సాయి పల్లవి..?

GRK