NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

GIS: పెట్టుబడిదారులకు ఏపి సర్కార్ రెడ్ కార్పెట్ ..పారిశ్రామిక వేత్తలకు అభినందనలు తెలిపిన సీఎం జగన్

GIS: విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పూర్తి అయ్యింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు. వనరులు, పరిస్థితులను దేశ విదేశాల నుండి వచ్చిన పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం వివరించింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సదస్సు విజయంతం చేసిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ధన్యావాదాలు తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు ఏపి ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పారిశ్రామిక వేత్తలకు అభినందనలు తెలియజేశారు. మొత్తం 15 రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్.. సదస్సు విజయవంతం అవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా ఏపి ఆర్ధికంగా ముందుకు వెళ్తొందనీ, నూతన పారిశ్రామిక విధానం తీసుకువచ్చామని తెలిపారు. ఏపిని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతామని సీఎం చెప్పారు. అభివృద్ధి పథంలో దూసుకువెళుతూ కోవిడ్ కష్టాలను కూడా అధిగమించామన్నారు. కరోనా సమయంలోనూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తూ అండగా నిలిచామని చెప్పారు.

AP CM YS Jagan Speech In Visakha Global Investers Summit

 

ఇప్పుడు కీలక సమయంలో జీఇఎస్ నిర్వహించామన్నారు సీఎం జగన్. పారదర్శక పాలనతో విజయాలు సాదిస్తున్నామని పేర్కొన్నారు. జీఇఎస్ ద్వారా 15 సెక్టార్ లో సెషన్స్ నిర్వహించామనీ, ఏపి అభివృద్ధికి ఈ 15 15 సెక్టార్లు అత్యంత కీలకమని అన్నారు. ఈ 15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్చలు జరిగాయనీ, రెండు రోజుల్లో 352 ఎంవోయూలు జరిగాయన్నారు. వందకు పైగా స్పీకర్లు పాల్గొన్నారని చెప్పారు. యూఎఈ, వియత్నాం, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా దేశాలతో ప్రత్యేక కంట్రీ సెషన్స్ నిర్వహించామని అన్నారు. జీఇఎస్ ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.13లక్షల 5వేల 663 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయన్నారు. దాదాపు 6లక్షల 3వేల 223 మందికి ఉపాధి అవకాశాలు దక్కినట్లు అవుతుందని చెప్పారు. మొత్తం పెట్టుబడుల్లో 8 లక్షల 84వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కేవలం ఎనర్జీ రంగంలో వచ్చాయన్నారు. గ్రీన్ ఎనర్జీతో భారత దేశ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ప్రయాణం కీలకమని అన్నారు. పర్యాటక రంగంలో 22వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపికి వచ్చాయని తెలిపారు.

 

కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి మాట్లాడుతూ జీఇఎస్ లో పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. నైపుణ్యం కల్గిన మానవ వనరులు ఏపికి సొంతం అని, ప్రతిభ గల యువత ఏపిలో ఉన్నారన్నారు. ప్రపంచ ఆర్ధిక ప్రగతిలో ఇండియా కీలకమని ఐఎంఎఫ్ ప్రకటించిందన్నారు. దేశంలో అంతర్జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని చెప్పారు. పలు కీలక రంగాల్లో కనెక్టివిటీ బాగా పెరిగిందన్నారు. నూతన భారత్ నిర్మాణం వేగంగా జరుగుతోందనీ, 2025 నాటికి ఇండియాలో 250 యూనికార్న్ సంస్థలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తొందని తెలిపారు. ఏపి ప్రగతికి చిత్తశుద్దితో కృషి చేస్తొన్న సీఎం జగన్ కు అభినందనలు అంటూ ప్రశంసించారు.

ఇప్పటం లో మరో సారి ఉద్రిక్తత .. ప్రహరీ గోడల కూల్చివేతలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju