ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇంతకు ముందు వివిధ జిల్లాల పర్యటన సందర్భంలో బాధితులు కాన్వాయ్ ని ఆపి తమ గోడును చెప్పుకోగా మానవత్వంతో వారికి ప్రభుత్వం ద్వారా తక్షణ వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టిన సంగతి విదితమే. తాజాగా కాకినాడ జిల్లా అన్నవరం గ్రామానికి చెందిన రాజులపూడి ఆరుద్ర అనే బాధితురాలి సమస్యపైనా సీఎం జగన్ స్పందించారు. రీసెంట్ గా ఆమె తన సమస్యను తెలుపుకునేందుకు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లగా సీఎం జగన్ అపాయింట్మెంట్ లభించలేదు. దీంతో ఆమె సీఎం క్యాంపు కార్యాలయం వద్దనే ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది.
వెంటనే ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ .. ఆమె సమస్యలను పరిష్కరించాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. అధికారులు ఆమెకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో ఆమెను శుక్రవారం ప్రత్యేక అంబులెన్స్ లో సీఎం క్యాంపు కార్యాలయానికి తీసుకువచ్చారు. సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అమె కుమార్తె చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందనీ, ఇల్లు విక్రయానికి అడ్డుపడుతున్న కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది. తన సమస్యల పట్ల స్పందించడమే కాకుండా హామీ ఇచ్చిన సీ ఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపింది ఆరుద్ర. సమస్యలు పరిష్కారం అయిన తర్వాత సీ ఎం జగన్ ఆపాయింట్మెంట్ ఖరారు చేసి కలిపిస్తామని అధికారులు తెలిపారని ఆమె మీడియాకు తెలిపింది.
సినీ నటుడు పోసానికీ న్యాయం చేసిన సీఎం వైఎస్ జగన్ ..కీలక పదవి కేటాయిస్తూ ఉత్తర్వులు