మచిలీపట్నం (బందరు) ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. వైఎస్ఆర్ నేతన్న హస్తం నాల్గవ విడత నిధులను పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం పెడనలో రాష్ట్ర వ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్ల ను బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ నేతన్నల సంక్షేమం కోసం రూ.2,049 కోట్ల ఖర్చు చేశామనీ, ఇంతకు ముందు ఏ ప్రభుత్వం ఇంతలా సాయం అందించలేదని అన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి ఇప్పటి వరకూ రూ.96 వేలు సాయం అందించామన్నారు. ఈ దేశ స్వాతంత్ర సమరాన్ని ఒక మగ్గం మార్చేసిందనీ, అాలంటి మగ్గం నేసే నేతన్నలకు అండగా తమ ప్రభుత్వం నిలబడుతోందని తెలిపారు.
ఈ ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్ తెలియజేస్తున్నానంటూ మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు సీఎం జగన్. త్వరలో పోర్టు శంకుస్థాపనకు వస్తానని సీఎం జగన్ ప్రకటించారు. పోర్టుకు కోర్టు అనుమతి ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగిందన్నారు. ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. చేనేత వస్త్రాలను అప్కో ద్వారా మార్కెటింగ్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంలోనూ గత ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు మంచి పనులు చేస్తుంటే ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, ఆర్కె రోజా, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, చీఫ్ విప్ లు సామినేని ఉదయభాను, ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, పార్ధసారధి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన చంద్రబాబు ..డీజీపీ ఆఫీసు వద్ద టీడీపీ నేతల ధర్నా