.ఏపి ప్రభుత్వం జీవో నెం.1 అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.1 ను హైకోర్టు ఈ నెల 23వ తేదీ వరకూ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జీవోను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఏపి హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఏపి సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. హైకోర్టులో పూర్తి స్థాయి విచారణ జరిపి తీర్పు ఇవ్వకుండానే ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో దుర్ఘటనలు జరిగి 11 మంది మృతి చెందిన నేపథ్యంలో.. జాతీయ, రాష్ట్ర రహదారులపై సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి వీలులేదంటూ ప్రభుత్వం జీవో నెం1ను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవోను అధికార వైసీపీ మినహా ఇతర రాజకీయ పక్షాలు అన్ని వ్యతిరేకించాయి. 1861 పోలీస్ యాక్ట్ లోని సెక్షన్ 30 ప్రకారమే జీవో విడుదల చేయడం జరిందని ప్రభుత్వం చెబుతోంది. ప్రతిపక్షాల సభలు, సమావేశాలను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ జీవో తీసుకువచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోపై ఏపి హైకోర్టులో సవాల్ చేశారు.
భావ ప్రకటనా స్వేచ్చ, ప్రాధమిక హక్కులను కాలరాసేలా ఈ జోవో ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. జీవోను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. సీపీఐ రామకృష్ణ తరపున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. ఈ నెల 23వ తేదీ వరకూ ఆ జీవోను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంలో ఏపి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులో తదుపరి విచారణ జరగకముందే ఏపి సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది.
Medak car fire accident case: అతని చావు తెలివి చచ్చుబండలైంది