ప్రముఖ దిన పత్రిక ఈనాడు విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శిపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేయడం, విస్తృతం తనిఖీలు ఒక పక్క జరుగుతుండగా, జగన్ సర్కార్ పై వ్యతిరేకంగా నిత్యం ఈనాడులో కథనాలు, వార్తలు ప్రచురితం అవుతూ ఉన్నాయి. ఈ తరణంలో ఈనాడు విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనాడు పత్రికపై ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. పోలవరం ప్రాజెక్టుపై తప్పుడు కథనం ప్రచురించిందన్న అభియోగంపై పరువు నష్టం దావా వేయాలని ఆదేశించింది.
ఈ ఏడాది మే 12న పోలవరం .. జగమంత వైఫల్యం పేరుతో ఈనాడు ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈనాడు కథనంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఈనాడు ఎండీ, జర్నలిస్టుల క్రిమినల్ ప్రొసిక్యూషన్ ఆఫ్ డిఫమేషన్ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. పోలవరం పై ఏపీ సర్కార్ చిత్తశుద్దితో పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా నిరాధారాలతో ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించిందని సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం .. రియల్టర్ లకు గుడ్ న్యూస్