KCR: తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది నెలలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు కేసీఆర్ విజయం సాధించారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న ప్రధాన పార్టీలు అన్నిటికంటే కేసీఆర్ పక్క వ్యూహాలతో దూసుకుపోతున్నారు. దీనిలో భాగంగా 119 నియోజకవర్గాలకు సంబంధించిన 115 మంది అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించేశారు. అయితే దూకుడుగా కేసీఆర్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు పెట్టినట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్. మేటర్ లోకి వెళ్తే టికెట్ వస్తుందని ఆశించిన ఆశావాహులు చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మారడం జరిగింది. ఇదే సమయంలో మొదటి లిస్టులో ప్రకటించిన అభ్యర్థులలో చాలామందిపై జనాల్లో మాత్రమే కాదు పార్టీలో కూడా తీవ్రమైన వ్యతిరేకత కనబడుతూ ఉంది.
దీంతో వచ్చే ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవాలంటే ఇప్పుడు కేసీఆర్ ముందు రెండు లక్ష్యాలు నెలకొన్నాయి. ఒకటి అసంతృప్తులను మెల్లిగా దగ్గరకు చేర్చుకోవడం. రెండవది.. ప్రకటించిన అభ్యర్థులకు ప్రచారం చేసుకోవడానికి కావలసినంత సమయం ఇవ్వడం. అయితే ఈ రెండిటిలో ఇప్పుడు మొదటి దాని విషయంలో కేసీఆర్ ముప్పుతీప్పలు పడుతున్నారట. మరోపక్క రాష్ట్రంలో ఇటీవల తెలంగాణ ఇంటెన్షన్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో 51 శాతం మంది కేసీఆర్ పాలనపై వ్యతిరేకత చూపుతున్నట్లు ఫలితాలు వచ్చాయంట. అలాగే అంతకుమించి అభ్యర్థులపై వ్యతిరేక భావన కూడా ప్రజలలో బలంగా ఉందట. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పట్ల కేవలం 38 శాతం జనాలే అనుకూలంగా ఉన్నారట. వ్యవసాయ రుణాలను మాఫీ చేసిన రైతులలో బీఆర్ఎస్ పార్టీ పట్ల సానుకూలమైన భావన కనిపించడం లేదట.
హడావిడిగా కేసీఆర్.. ఇటీవల ఎన్నికల ముందు రుణమాఫీ చేయడం జరిగింది. వాస్తవానికి ఈ రుణమాఫీ ఎప్పుడో జరగాల్సింది. కానీ ఎన్నికల ముందు ఏదో రైతులపై ప్రేమ ఉన్నట్టు బీఆర్ఎస్ చేసిన హడావిడి రుణమాఫీ రైతులలో సానుకూలత తీసుకురాలేదట. సో ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ పట్ల తెలంగాణ జనాలు ఉన్నట్లు సర్వేలో ఫలితాలు వచ్చాయి. దీంతో ఈసారి జరగబోయే ఎన్నికలలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కటం అసంభవమని విశ్లేషణలు వస్తున్నాయి.