Central Team: మిచౌంగ్ తుఫాను కారణంగా ఇటీవల రాష్ట్రంలో రైతాంగం భారీగా నష్టపోయింది. దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రభుత్వం ప్రాధమికంగా అంచనా వేసింది. దాదాపు పది వేల కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తుఫాను వల్ల రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం ఏపికి చేరుకుంది.
నేడు, రేపు తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఈ బృందం పర్యటించనుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బృందం ఇవాళ ఉమ్మడి కృష్ణా, బాపట్ల జిల్లాల్లో, రేపు ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనుంది. రెండు రోజుల రాష్ట్రంలో జరిగే ఈ పర్యటనలో ముందుగా కేంద్ర బృందం డిజాస్టర్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ తో భేటీ కానుంది. రెండు బృందాలుగా ఏర్పడి తుఫాను ప్రభావిత ప్రాంతాలను బృంద సభ్యులు పరిశీలించనున్నారు. ఈ బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలనతో పాటు తుఫాను వల్ల జరిగిన నష్టంపై ఆయా జిల్లాల అధికారుల నుండి సమాచారం సేకరించనుంది.
మరో వైపు ఉమ్మడి కర్నులు జిల్లాల్లో కూడా కేంద్ర బృందం ఇవేళ రేపు పర్యటించనుంది. ఆయా జిల్లాల అధికారుల నుండి సంబంధిత సమాచారాన్ని సేకరిస్తారని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ పేర్కొన్నారు. కాగా కరువు నివారణ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.659 కోట్లు సాయం అందించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. కేంద్ర బృందం పర్యటనతో ఢిల్లీ నుండి రాష్ట్రానికి ఎంత సాయం అందిస్తుంది అన్నదానిపై ఎదురుచూడాల్సి ఉంది.
Janasena: 21 మంది అభ్యర్ధులతో జనసేన ఫస్ట్ లిస్ట్..?? సోషల్ మీడియాలో వైరల్