Ali: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ మొత్తం పొత్తుల చుట్టూ తిరుగుతూ ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఎప్పుడైతే పొత్తుల ప్రస్తావన తీసుకు రావడం జరిగిందో.. అప్పటినుండి ఏపీలో ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయినట్లు పరిస్థితి మారింది. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్.. తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ.. వస్తున్నారు. మొన్ననే కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేయగా.. ఆ తర్వాత కొత్త మంత్రులతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టడం జరిగింది. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ మంత్రి పదవులు కట్టబెట్టిన జగన్.. 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పాలన అందిస్తున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కరోనాతో ఆర్థికంగా రాష్ట్ర ఖజానాకు రాబడి తక్కువైనా గాని.. ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే పార్టీ ప్రజా ప్రతినిధులను.. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచింది. నిరంతరం ప్రజలలో ఉండాలని జగన్ ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. దీంతో ఇప్పుడు గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని వైసీపీ నేతలు చేస్తూ వస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ పార్టీ నాయకుడు.. సినీ నటుడు ఆలీ.. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో.. వైయస్సార్సీపి ప్రవాసాంధ్రులు నిర్వహించిన మహా గర్జనలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ మళ్లీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావటం గ్యారెంటీ అని తేల్చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
రాష్ట్ర చరిత్రలో అవినీతికి తావు లేకుండా ప్రజల వద్దకు సంక్షేమాన్ని అందించి ఘనత.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ కే దక్కింది అని పేర్కొన్నారు. దీంతో ఆలీ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరుపున ఆలీ ప్రచారంలో కీలకంగా రాణించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఆలీకి గ్యారెంటీగా పార్టీ తరఫున పదవి వచ్చే అవకాశం ఉంది అని అందరూ భావించారు. ఈ క్రమంలో ఇటీవల వైసీపీ నుండి రాజ్యసభకు ఆలీ వెళ్తున్నట్లు కూడా.. వార్తలు వచ్చాయి. కాని వచ్చిన వార్తలలో వాస్తవం లేదని ఆలీ తెలిపారు. అయినా గాని ఆలీ పార్టీ తరఫున పదవి రాకపోయినా ..వైసీపీలో చాలా యాక్టివ్ గా ఉండటం విశేషం.