Corona Cases In ap: రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. వేల సంఖ్యలో కేసులు అవుతున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 20వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. 1,15,784 శాంపిల్స్ పరీక్షించగా 20,034 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. పాజిటివిటీ రేటు 17.38 శాతంగా ఉన్నట్లు ఏపి ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 82 మంది కరోనాతో మృతి చెందారు. అయితే వైరస్ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని సింఘాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ కొరత లేదని తెలిపారు.
Corona Cases In ap: శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక కేసులు
రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో 20వేలకుపైగా పాజిటివ్ కేసులు రాగా అందులో శ్రీకాకుళం జిల్లా నుండే అత్యధికంగా 2398 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అత్యల్పంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో 793 కేసులు నమోదు అయ్యాయి. ఇక మరణాల విషయానికి వస్తే అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 12 మంది కరోనాతో మృతి చెందారు. అనంతపురం జిల్లాలో 9 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 9 మంది, విజయనగరం జిల్లాలో 9 మంది. నెల్లూరు జిల్లాలో 7, కృష్ణాలో ఆరుగురు, గుంటూరు జిల్లాలో 5, చిత్తూరు జిల్లాలో నలుగురు, కర్నూలు జిల్లాలో నలుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు చనిపోయారు. 24 గంటల్లో 12,207 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.