NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

EBC Nestham: అగ్రకుల మహిళకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ ..! ఏడాదికి రూ.15వేల సాయం..! ఇవీ నిబంధనలు..!!

EBC Nestham: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలునకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అప్పులు తెచ్చిమరీ నవరత్న పథకాలను కొనసాగిస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దుతున్నారని జగన్ సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా సీఎం జగన్ ఆ విమర్శలు ఏమీ పట్టించుకోవడం లేదు. సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అగ్రవర్ణాల్లోని పేద మహిళల కోసం ఈబీసీ నేస్తం పథకం అమలునకు జగన్ సర్కార్ ముహూర్తం ఖరారు చేసింది. ఈబీసీ నేస్తం ఫథకంలో లబ్దిపొందేందుకు అర్హులైన అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు సంవత్సరానికి రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనున్నది. అగ్ర కులాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కల్గిన మహిళలు ఈబీసీ నేస్తం పథకం పొందేందుకు అర్హులు.

EBC Nestham scheme details
EBC Nestham scheme details

EBC Nestam: ఈబీసీ మహిళల జీవన ప్రమాణాల మెరుగుకే

ఈ పథకం జీవో విడుదల అయిన రోజుకు 45 నుండి 60 సంవత్సరాలు నిండిన ఈబీసీ మహిళలకు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ఆర్థిక సాయం అందించడం ముఖ్య ఉద్దేశం. లబ్దిదారులకు ఆర్థిక సాయంగా సంవత్సారనికి రూ.15వేల చొప్పున మూడేళ్లకు రూ.45వేలు అందించనున్నారు. దీని కోసం 2021 – 22 బడ్జెట్ కింద ప్రభుత్వం సంవత్సరానికి 670 – 605 కోట్లు, అలా మూడేళ్లకు రూ.1810 – 2011 కోట్లు కేటాయించింది.

పథకం వర్తింపునకు నిబంధనలు ఇవి

వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తంలో ఉన్న లబ్దిదారులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలు అర్హులు కారు. కేవలం ఈబీసీ మహిళలు మాత్రమే అర్హులు. లబ్దిదారుల పేరుతో ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ బుక్ ఉండాలి. ఇక వార్షిక ఆదాయం గ్రామాల్లో అయితే లక్షా 20వేలు, పట్టణాల్లో అయితే లక్షా 44వేలు మించకూడదు. ఈ పథకం లో లబ్దిదారులకు పల్లపు భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. లేదా మెట్ట భూమి పది ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి గానీ పెన్షనర్ గాని ఉండకూడదు. అయితే ఈ నిబంధనల్లో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చారు. కుటుంబంలో ఎవరి పేరు మీద ఫోర్ వీలర్ ఉండకూడదు. కుటుంబంలో ఎవరూ కూడా ఇంకమ్ ట్యాక్స్ కడుతున్న వారు ఉండకూడదు. 2021 సెప్టెంబర్ 29 నాటికి 45 సంవత్సరాలు కంటే ఎక్కువ, 60 సంవత్సరాల లోపు ఉన్న అగ్రకుల మహిళలు ఈ నెల 7వ తేదీ లోపు సమీప గ్రామ వార్డు, సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju