Corona Vaccine: వంద మందికి భోజనం ప్రిపేర్ చేశారు..కానీ 120 మంది వచ్చారు, వారందరికీ ఆ వండిన భోజనం సర్దుబాటు చేయడం తప్పుకాదు. అందరి ఆకలి తీరుతుంది. ఓ వెయ్యి మందికి వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేయడానికి లక్ష రూపాయలు మంజూరు అయ్యాయి అనుకోండి. అక్కడ 120 మంది ఉన్నారు. అప్పుడు ఏమి చేయాలి. ఈ వెయ్యి మందికి ఎంతో కొంత నగదు తగ్గించి ఇచ్చి మిగతా 20 మందికి సర్దుబాటు చేయడం కరెక్టే అంటారా? తమకు వచ్చిన నగదులో తగ్గించడానికి వారు ఒప్పుకుంటారా? అయితే డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్సఫర్ అయితే ఇచ్చినంత తీసుకోవాలి, నోరు మెదిపే అవకాశం కూడా ఉండదు. ఇదంతా ఎందుకు అంటే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది లీల ఒకటి తాజాగా బయటపడింది.
కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం నుండి కొన్ని ప్రాంతాల నుండి ఓ విమర్శ వస్తున్నది. ప్రజలకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్ డోస్ ను సక్రమంగా ఇవ్వకుండా కొంత మిగుల్చుకొని ఆ వ్యాక్సిన్ డోసులను ప్రైవేటు ఆసుపత్రులకు వైద్య ఆరోగ్య శాఖలోని కొంత మంది సిబ్బంది అమ్ముకుంటున్నారనే విమర్శ ఉంది. కొన్ని వ్యాక్సిన్ కేంద్రాల్లో వైద్య ఆరోగ్య సిబ్బందిని 1ఎంఎల్ కంటే తక్కువ డోస్ ఇస్తుండటంపై నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖలో చాలా వరకు ఎఎన్ఎంలు, నర్స్ లు అందరూ వ్యాక్సిన్ సక్రమంగా ఇవ్వడం వచ్చిన వారే. అయితే వారి విధి నిర్వహణ ప్రకారం కశ్చితంగా 1 ఎంఎల్ మోతాదులో ఎందుకు ఇవ్వలేదు అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. సిబ్బంది కశ్చితంగా వ్యాక్సిన్ డోస్ లు ఇవ్వలేదు అని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. దాన్ని ఆ శాఖ అధికారులు సమర్ధించుకుంటున్నారు అనుకోండి. అది వేరే విషయం.
Read More: Loan App Case: ఈడీలోనూ అవినీతి తిమింగళం..! కేసు నమోదు చేసిన సీబీఐ..!!
ఏపికి కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు మొత్తం కలిపి 98 లక్షల 85వేల 650 డోసులు వస్తే మన పని తనం కల్గిన కొందరు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పొదుపుగా వ్యాక్సిన్ వేయడం వల్ల అదనంగా మరో 2లక్షల మందికి అంటే మొత్తంగా కోటి 74వేల 471 డోసులు ఇచ్చారు అన్నమాట. 98,85,650 డోసులు వస్తే కోటి మందికిపైగా ఇచ్చారు అంటే ఒక విధంగా అభినందించాల్సిందే. కానీ ఇది కరెక్టా. ఇవ్వాల్సిన మోతాదులో ఎందుకు ఇవ్వలేదు. అడిగేది ఎవరు.
క్వాలిఫైడ్ అయిన ఎఎన్ఎంలు, నర్సులు వ్యాక్సిన్ నిబంధనల ప్రకారం కశ్చితంగా 1 ఎంఎల్ ఇవ్వలేక పోయారా లేక కావాలనే మిగల్చడంతో 1 ఎంఎల్ కంటే తక్కువ వేశారా. ఈ వ్యాక్సిన్ లెక్కలు కాగ్ కు ఇస్తే మాత్రం తప్పకుండా తప్పుబడుతుంది. ఎన్ని డోసులు వస్తే అంత మందికి సరిపోయేలా ఇస్తే దుబరా (వేస్టేజ్) జరగనట్లు. తక్కువ మందికి టీకా వేస్తే కొంత వేస్టేజ్ జరిగినట్లు లెక్క. అదే వచ్చిన డోసుల కంటే ఎక్కువ డోస్ లు వినియోగించినట్లు లెక్క చెబితే అది తప్పు జరిగినట్లు కాదంటారా మీరే చెప్పండి.