Breaking: విజయవాడలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రీసెంట్ గా ఈడీ అధికారులు అక్కినేని ఉమెన్స్ హాస్పటల్, ఎన్ఆర్ఐ ఆసుపత్రుల్లో, డైరెక్టర్ల నివాసాల్లో తనిఖీలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారం మరువకముందే ఇప్పుడు ఆదాయపన్ను (ఐటీ) శాఖ బృందాలు విజయవాడలోని ప్రముఖ వైసీపీ నేతల నివాసాల్లో సోదాలు జరపడం హాట్ టాపిక్ అయ్యింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఒక భూమి వ్యవహారంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తొంది.
దాదాపు 20 ఐటీ బృందాలు విజయవాడ, హైదరాబాద్, నెల్లూరులో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసంతో పాటు వంశీ రామ్ బిల్డర్స్ యజమాని ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేశారు. నెల్లూరులోని ఆ సంస్థలకు చెందిన సీఈఓ, డైరెక్టర్లు, పెట్టుబడిదారుల కార్యాలయాలు, ఇళ్లల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఐటి అధికారుల తనిఖీలకు సంబందించి పూర్తి వివరాలు అధికారికంగా తెలియరావాల్సి ఉంది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ రెబల్ ఎంపి రఘురామ షాకింగ్ ప్రతిపాదన