KRMB: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఎట్టకేలకు స్పందించింది. అటు తెలంగాణ, ఇటు ఏపి ప్రభుత్వం ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖలు రాసింది. ఆర్డీఎస్ కుడి కాల్వ పనులు చేపట్టవద్దని కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి హరికేష్ మీనా ఏపి ప్రభుత్వానికి లేఖ రాశారు. బోర్డుకు డీపిఆర్ ఇవ్వకుండా, ఆమోదం తీసుకోకుండా పనులు చేయవద్దని ఆదేశించారు.
మరో పక్క తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ ఉత్పత్తి నిలుపుదల చేయాలని కేఆర్ఎంబీ ఆదేశించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుండి విద్యుత్ ఉత్పత్తికి నీటి విడుదల ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జెన్ కో సంచాలకుడికి కేఆర్ఎంబీ సభ్యుడు మౌంతాంగ్ లేఖ రాశారు.
అయితే రెండు రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేసింది. ఓ పక్క అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ప్రాజెక్టుల నుండి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నదంటూ కేంద్రానికి ఏపి ప్రభుత్వం ఫిర్యాదు చేసిన దరిమిళా రెండు రోజుల క్రితమే విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేసింది.