NewsOrbit
Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Yarlagadda Venkatarao: గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావును ప్రకటించిన లోకేష్..!!

Yarlagadda Venkatarao: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా యార్లగడ్డ వెంకట్రావును ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఈ సభకి కృష్ణాజిల్లాతో పాటు ఏలూరు ఇంకా పశ్చిమగోదావరి జిల్లా కి చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వంపై అదే విధంగా కొడాలి నాని ఇంక వల్లభనేని వంశీ లపై లోకేష్ తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Lokesh announced Yarlagadda Venkatarao as the in charge of Gannavaram TDP

వల్లభనేని వంశీనీ వచ్చే ఎన్నికలలో ఓడించాలని లోకేష్ పిలుపునిచ్చారు. కొడాలి నానిని సైతం ఓడించాలని ప్రజలను కోరారు. రాజకీయాలకు సంబంధం లేని తన కుటుంబ సభ్యులపై అనవసరంగా నోరు జారుకున్నారని హెచ్చరికలు చేశారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని పేర్కొన్నారు. అయితే మంగళవారం సభ జరగక బుధవారం గన్నవరం ఇన్చార్జిగా యార్లగడ్డ వెంకట్రావుని లోకేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఓటమి కోసం.. తామంతా కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కంచుకోట అని చెప్పుకొచ్చారు. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వల్లభనేని వంశీ..వైసీపీకి మద్దతు తెలిపిన గాని ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు వెల్లలేదని స్పష్టం చేశారు.

Lokesh announced Yarlagadda Venkatarao as the in charge of Gannavaram TDP

రాజకీయాల్లోకి తాను రౌడీయిజం చేయడానికి రాలేదని ప్రజాసేవ చేయడం కోసం వచ్చినట్లు పేర్కొన్నారు. కొత్త పాత కలయికలను సమన్వయం చేసుకొని ముందుకు సాగుతామని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఎవరికైనా సమస్య వస్తే నేరుగా తన వద్దకు వచ్చి చెప్పుకోవచ్చు అని యార్లగడ్డ స్పష్టం చేశారు. 2019 ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వంశీ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగా వంశీ..వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటినుండి వైసీపీ హై కమాండ్ పై అసహనంగా ఉన్న యార్లగడ్డ.. కొద్ది రోజుల క్రితం చంద్రబాబుని కలవడం జరిగింది. ఆ తర్వాత లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో లోకేష్ బుధవారం గన్నవరం ఇన్చార్జిగా యార్లగడ్డని ప్రకటించడంతో.. కృష్ణాజిల్లాలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!