Cyclone Michaung: రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని తెలిపింది. శనివారానికి తీవ్ర వాయుగుండంగా, ఆదివారానికి తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.
తుఫాను (Cyclone Michaung) సోమవారం చెన్నే – మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో ఆదివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే సూచన ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించారు.
Telangana Elections: ఆ బీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యే పై కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు.. ఫోటోలు వైరల్ ఫలితం