ఏపి హైకోర్టుకు నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు గురువారం ప్రమాణం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో న్యాయమూర్తులు జస్టిస్ ఏవి రవీంద్ర బాబు, జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ సాగర్, జస్టిస్ బండారు శ్యామ్ సుందర్, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్, జస్టిస్ బొప్పన వెంకట లక్ష్మీ నరసింహ చక్రవర్తి, జస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జునరావు, జస్టిస్ దుప్పల వెంకట రమణలతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
వాస్తవానికి న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించే విషయంలో గవర్నర్ తన అధికారాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదలాయిస్తారు. దీంతో ప్రధాన న్యాయమూర్తే (సీజే) కొత్త న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించడం ఆనవాయితీ. అయితే ఏపీ సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కు మాతృవియోగం కలగడంతో ఆయన ఈ కార్యక్రమం నిర్వహించే పరిస్థితి లో లేరు. దీంతో కొత్త న్యాయమూర్తులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు.
మరో వివాదంతో చిక్కుకున్న వైసీపీ ఎంపీ ..వైరల్ వీడియోపై స్పందించిన ఎంపీ గోరంట్ల మాధవ్