NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సరైన పాయింట్ లేవనెత్తిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశానికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సరైన పాయింట్ లేవనెత్తారు. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పట్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 2026 లో జన గణన అదారంగా అసెంబ్లీ స్థానాల పునర్విభజన ఉంటుందని తెలిపారు.  2026లో జనాభా లెక్కలు వచ్చి, రాజ్యాంగ సవరణ చేసి, పునర్విభజన ప్రక్రియను ప్రారంభించి దాన్ని పూర్తి చేయాలంటే 2031 వరకు ఆగాల్సిందే.

 

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదు అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2031 వరకు సాధ్యం కాదని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు సోమిరెడ్డి. విభజన చట్టం హామీల్లో పునర్విభజన ఉందనే విషయాన్ని కేంద్ర పెద్దలు గుర్తుంచుకోవాలన్నారు. కశ్మీర్ లో నియోజకవర్గాల పునర్విభజనకు అవసరం లేని చట్ట సవరణ తెలుగు రాష్ట్రాలకే అవసరం అయ్యిందా అని ప్రశ్నించారు సోమిరెడ్డి. ఒక్కో రాష్ట్రం విషయంలో ఒక్కోలా నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదని అన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న నియోజకవర్గాల పునర్విభజన హామని వెంటనే నెరవేర్చాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

 

ఏపి, తెలంగాణకు చెందిన ఎంపిలు సభ్యులు పార్లమెంట్ లో సోమిరెడ్డి లేవనెత్తిన సందేహాన్ని ప్రశ్నించకపోవడం గమనార్హం. విభజన చట్టంలో ఉన్న అనేక హామీలను కేంద్రం బుట్టదాఖలు చేసింది. అందులో ప్రధానంగా ఏపికి ప్రత్యేక హోదా ఉంది. పోలవరం ప్రాజెక్టు ఉంది. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు విడుదల చేయడం లేదు. అదే విధంగా విభజన చట్టంలో ఉన్న నియోజకవర్గాల పునర్విభజనను కేంద్రం పక్కన పెట్టేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కేంద్రంపై ఏ విధంగా వత్తిడి తీసుకువస్తారో వేచి చూద్దాం.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju