రెండే రోజులు.. రెండంటే రెండే రోజులు.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 18న ఏపీ సహా.. ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘంనోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక, అప్పటి నుంచి ఐదు రోజుల్లో.. నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. కట్ చేస్తే.. ఈ పరిణామంలో వైసీపీ క్లారిటీగానే ఉంది. అంటే.. మొత్తం 175 అసెంబ్లీ, పాతిక పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసుకుంది.
కానీ, ఎటొచ్చీ.. కూటమి పార్టీల్లోని టీడీపీలో మాత్రం గందరగోళం చిందరవందరగానే కొనసాగుతోంది. ఇప్పటికీ కనీసంలో కనీసం 5 నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో తర్జన భర్జనలు కొనసాగుతున్నా యి. తిరువూరులో అభ్యర్థి ని మార్చే ప్రయత్నం కొనసాగుతోంది. పోనీ.. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థికి టికెట్ ఉందని చెబుతున్నారా? అంటే.. అది కూడా చేయడం లేదు. ఇక, ఇక్కడి టికెట్ ఆశించిన జవహ ర్ కూడా.. 18 వరకు వేచి చూసి నిర్ణయంప్రకటించే యోచనలో ఉన్నారు.
అదేవిధంగా ఇటీవల టీడీపీలో చేర్చుకున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పరిస్థితి కూడా అగ మ్య గోచరంగా ఉంది. ఆయనకు టికెట్ ఇస్తారా? లేదా? అనేది ఇప్పటికీ తెలియదు. పోనీ.. టికెట్ ఇచ్చే ఉద్దేశం ఉంటే.. అది ఉండా? ఉంగుటూరా? నరసాపురమా? అనేది కూడా స్పష్టతలేదు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లోనూ ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు డోలాయమానంలో పడ్డారు. తమ పరిస్థితి ఏంటని వారు తర్జన భర్జన పడుతున్నారు. దీంతో ప్రచార జోరు కూడా కనిపించడం లేదు.
ఇక, రాజంపేట పార్లమెంటు స్థానంలోనూ బీజేపీకి ఇబ్బందులు ఉన్నాయి. ఈ సీటును తనకు ఇచ్చి.. ఎమ్మెల్యే సీటును మార్చాలని.. సీనియర్ నాయకుడు ఆదినారాయణరెడ్డి కోరుతున్నారు. ఇక, విశాఖలో నూ తనకు సీటు కావాలని జీవీఎల్ పట్టుబడుతున్నారు. జనసేనలోనూ.. తిరుపతి పంచాయతీ ఇంకా తెగలేదు. మరోవైపు.. పాలకొండలో జనసేన నాయకురాలు భూదేవి సెగలు కక్కుతున్నారు.
తనకు టికెట్ ఇస్తానని చెప్పిన పవన్.. టీడీపీ నుంచి వచ్చిన నిమ్మక జయకృష్ణకు ఇవ్వడం ఏంటని నిప్పులు చెరుగుతున్నారు. ఇండిపెండెంట్గా పోటీకి సై అంటున్నారు. మొత్తంగా చూస్తే.. కూటమి పార్టీ ల్లోనామినేషన్లకు ముందే ఈ వివాదాలు పరిష్కారం అవుతాయా? లేక.. తర్వాత పంచాయితీలు జరుగుతా యా? అనేది ఆసక్తిగా మారింది.