దేశమంతా లాక్ డౌన్ వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురి అవుతుంటే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మాత్రం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను ఎలా సమయానికి అమలు చేస్తున్నారో అర్థం కాక అటు విపక్షాల తో పాటు ఇటు రాజకీయ పండితులు సైతం తలలు పట్టుకుంటున్నారు. అంతెందుకు వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రతి సామాన్యుడిని ఒక ప్రశ్న వేధిస్తోంది. ఇలా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు జగన్ కనబరుస్తున్న చిత్తశుద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు సంక్షేమ పథకాలను ఎగ్గొట్టే పాలకులను చూసిన వాళ్ళకు… అనాదికాలంగా వస్తున్నా రాజకీయాలకు విరుద్ధంగా కష్టకాలంలో మేనిఫెస్టో అమలుకు ఏకంగా క్యాలెండర్ ను విడుదల చేసిన ఘనత ఒక్క జగన్ కే చెల్లింది.
జగన్ ను ఏ కోరికతో అయితే సీఎం గా అందరూ గెలిపించుకున్నారో…. ఆ జనం.. ఇప్పుడు కష్టకాలంలో జగన్ తను చెప్పిన మాట పై నిలబడి ప్రజల్లో మరింత నమ్మకం మరియు అభిమానం పెంచుకున్నాడు అని అనుకుంటున్నారు. అయితే జగన్ సర్కార్ పై ఒక చిన్న అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయింది. దానిని కూడా జగన్ పరిగణలోకి తీసుకొని వెంటనే పరిష్కారం చేయడం గమనార్హం.
అది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు పూర్తి స్థాయిలో అందక పోవడమే. నిజానికి లాక్ డౌన్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం జరిగింది. ఇక మన రాష్ట్రం దానికి ఏమీ మినహాయింపు కాదు. అయితే గత రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగుల్లో 2, 3 డిపార్ట్మెంట్ లకు తప్ప మిగిలిన ఉద్యోగుల వేతనాల్లో కోత విధించారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి సృష్టించబడ్డ సచివాలయం ఉద్యోగాలు జీవితాల్లో కూడా 10% వేతనాలను కట్ చేయడం గమనార్హం.
ప్రతి నెలా వివిధ కమిట్మెంట్లకు పోనూ వేతనాన్ని పొదుపుగా వాడుకుంటున్న ఉద్యోగులకు సగం జీతంతో ఇబ్బందులు పడ్డారు. అయితే కరోనాతో ఆర్థిక ఇబ్బందులని సరిపెట్టుకుంటున్నా….మరోవై
అయితే జగన్ ఆ వేతనాల్లో కోత ను కేవలం రెండు నెలల కే పరిమితం చేయడం నిజంగా అభినందనీయం. వచ్చే నెల నుండి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పూర్తిస్థాయి వేతనాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒకపక్క మద్యం షాపులు తెరుచుకోవడం మరియు మరొక పక్క మిగతా షాపులకు నిర్దేశిత సమయం లో వ్యాపారం జరుపుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగిన మరునాడే ఉద్యోగులందరికీ వచ్చేనెల నుండి పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జగన్ గ్రాఫ్ మరింత పైకి పెరిగిపోయింది. ఇక మిగిలి ఉన్నదల్లా ఇప్పటివరకు కోత విధించిన వేతనాలను మళ్లీ ఎప్పటికీ తిరిగి ఉద్యోగులకు అందజేస్తారు అన్న విషయంపై స్పష్టతే. ఇన్ని చేసినా ముఖ్యమంత్రి అది ఒకటి చేయకుండా పోతాడా ఏమి?