మిస్టర్ కూల్… క్రికెట్ కు ఓ డిక్షనరీ… అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు.. భారత క్రికెట్ చరిత్రకు ఆయన ఓ సాక్ష్యం… ధోనీ భారత క్రికెట్ కు ఒక సరికొత్త పాఠం… అంతకు ముందు ఎవరికీ సాధ్యం కాని ప్రయాణం సాగించాడు. వన్డే క్రికెట్ లో దూకుడు అస్త్రంతో భారత్ కు ఎన్నో విజయాలు అందించాడు. 1983 తర్వాత కలగా ఉన్న వరల్డ్ కప్ డ్రీమ్ ను సాధించిపెట్టాడు. ట్వంటీ ట్వంటీ క్రికెట్ లో వరల్డ్ కప్ అందించిన ఘనత ధోనీది. అంతేనా టెస్టుల్లో భారత్ జట్టును అగ్రగామిగా తీర్చిదిద్దాడు.
అంతర్జాతీయ క్రికెట్ కు మహేంద్ర సింగ్ ధోనీ గుడ్ బై చెప్పిన ధోనీ మద్దతిచ్చిన అభిమానులకు ఇన్స్టాగ్రామ్ ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. 15 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో గొప్ప విజయాలను భారత్ కు అందించాడు. భారత్ జట్టుకు కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా మరపురాని విజయాలు అందించాడు. చివరగా ధోనీ 2019 లో న్యూజీలాండ్ తో ఆడిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆడాడు. ధోనీ 2014లో టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 350 వన్డేలు ఆడిన ధోనీ… 98 ట్వంటీ 20 మ్యాచ్లలో భారత్ కు నేతృత్వం వహించాడు. 350 వన్డేల్లో ధోనీ 10773 పరుగులు చేశాడు. 50.57 సగటుతో దేశంలోనే గొప్ప క్రీడాకారుడిగా పేరు గడించాడు. పది సెంచరీలతోపాటు, 73 సార్లు 50 పరుగులకు పైగా చేశాడు. ట్వంటీ 20ల్లో ధోనీ… 37.60 సగటుతో 1617 పరుగులు చేశాడు. రెండు అర్ధ సెంచరీలు చేశాడు. వన్డేల్లో పది వేల పరుగులు చేసిన ఐదో భారతీయ ఆటగాడిగా ధోనీ నిలిచారు.