YS Jagan ; తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక రోజు రోజుకి రాజకీయ ఉత్కంఠని పెంచుతుంది.. వైసీపీకి ఈజీ అనుకున్న చోట ఇప్పుడు వైసీపీకి చెమటలు పట్టే పరిస్థితి వచ్చింది. ప్రచారంలో టీడీపీ దూసుకెళ్తుండడం.. బీజేపీ కూడా వైసీపీపై హిందూ వ్యతిరేక ముద్రని బాగా తీసుకెళ్తుండడంతో.. ఇక తప్పని పరిస్థితిలో వైసీపీ అప్రమత్తమైంది. సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఈ నెల 14 న ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మొదట అనుకున్న ప్రకారం అయితే జగన్ వెళ్లకుండా మేనేజ్ చేయాలి అనుకున్నారు.., కానీ పరిస్థితులు మారుతున్నాయి. వెళ్ళక తప్పట్లేదు..!
Read It ; తిరుపతిలో టీడీపీ ఏం చేస్తుంది..!? ఫలితం ఎలా ఉండొచ్చు..!?
YS Jagan ; నాలుగు నియోజకవర్గాల్లో ఓటర్ మీటర్ తిరుగుతుంది..!?
తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ రాజకీయ పార్టీలతో పాటూ వివిధ సర్వే బృందాలు, ఇంటెలిజెన్స్ బృందాలు తిష్ట వేసాయి. రెండు రోజులకోసారి సర్వే నివేదికలు రూపొందించి పార్టీ పెద్దలకు అందిస్తున్నాయి. టీడీపీకి రాబిన్ శర్మ టీమ్ నుండి ఒకటి, టీడీపీ సొంత ఇంటెలిజెన్స్ నుండి ఒకటి.. ఇలా రెండు రకాల నివేదికలు అందుతుండగా… వైసీపీకి అధికారిక సీఎం సొంత ఇంటెలిజెన్స్, పార్టీ సర్వే టీమ్, పీకే బృందం ద్వారా మూడు రకాల నివేదికలు అంటున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో అనూహ్య మార్పులు వస్తున్నాయి. వైసీపీకి గాలి తగ్గుతుంది. టీడీపీ ప్రచారంలో దూసుకెళ్తుండడం ఆ పార్టీకి కలిసొస్తున్న విషయం వెల్లడయింది. ముఖ్యంగా గూడూరు, తిరుపతి, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో పరిస్థితులు మారుతున్నట్టు గుర్తించారు. వైసీపీ అత్యంత బలంగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో రోజు రోజుకీ వైసీపీ బలం తగ్గుతుందని తేలడంతో సీఎం జగన్ రోజులో గంట పాటూ ఈ ఎన్నిక, ప్రచార తీరుపై గడపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. గూడూరులో ఎమ్మెల్యే వర్గం పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తుందేమో అనే అనుమానాలు.. తిరుపతిలో హిందూ వ్యతిరేక ముద్ర బలంగా వేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుండడం.., మరోవైపు టీడీపీ అన్ని రకాలుగా ముందుండడంతో జగన్ సీరియస్ గా ఈ ఎన్నికపై దృష్టి పెట్టినట్టు సమాచారం.
Must Read ; జనసేన – బీజేపీ ఇప్పుడు భజన..!? ఫలితం తేడా కొడితేనో..!?
14 న తిరుపతిలో బహిరంగ సభ, రోడ్ షో..!?
తను హిందూ వాదిని.., బీజేపీ దుష్ప్రచారం చేస్తుంది. తిరుపతి ప్రతిష్టని వైసీపీ ప్రభుత్వం వచ్చాక కాపాడుతుంది.. వైసీపీ హిందూ వ్యతిరేకి కాదు.. ఈ రకమైన ప్రచారాన్ని శ్రేణుల్లోకి.. తద్వారా ఓటర్లలోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని సర్వే బృందాలు గుర్తించాయి. అందుకే
తిరుపతిలో సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఈ నెల 14 తిరుపతి నగరంలో మూడు గంటల పాటూ రోడ్ షో నిర్వహించి.., ఓ చోట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. జగన్ కూడా ఈ మేరకు అధికారులకు, పార్టీ పెద్దలకు కీలక సూచనలు చేశారు. గమ్మత్తేమిటంటే.. అదే రోజున టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తిరుపతి నగరంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈసీకి, పోలీసులకు సమాచారం ఇచ్చి, అనుమతులు కూడా తీసుకున్నట్టు సమాచారం. ఒకవేళ సీఎం జగన్ కూడా అదే రోజున వెళ్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో..!? మరో ముఖ్యమైన అంశమేమిటంటే.. సీఎం అయ్యాక జగన్ పాల్గొననున్న తొలి పొలిటికల్ మీటింగ్ ఇదే కానుంది..!!