Ntr30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ Ntr30 ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్వకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలో పూర్తి కానుంది. దీని తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా కన్ఫర్మ్ అయింది. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అనుకుంటే.. అది కొరటాల శివ వైపుకు టర్న్ అయింది. త్రివిక్రమ్ తో సినిమా ఎందుకు క్యాన్సిల్ అయిందో ఓ క్లారిటీ లేకపోయినా.. కొరటాల శివతో సినిమా క్లారిటీ అయింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడీ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ లో రౌండ్ అవుతోంది.
సినిమాలో ఓ కీలక పాత్రను మళయాళ సూపర్ స్టార్ గా పేరున్న నటుడితో చేయించాలని దర్శకుడు కొరటాల శివ ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్త ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది. ఇప్పటికే కొరటాల తన ప్రయత్నాలు ప్రారంభించాడని అంటున్నారు. దాదాపు తన ప్రతి సినిమాలో ఇతర భాషల నుంచి కీలకమైన పాత్రల కోసం పేరున్న నటుల్ని తీసుకుంటూనే ఉన్నాడు. మిర్చిలో తమిళం నుంచి సత్యరాజ్, జనతా గ్యారేజ్ లో మళయాళం నుంచి మోహన్ లాల్, భరత్ అనే నేనులో తమిళం నుంచి శరత్ కుమార్, ఆచార్యలో బెంగాల్ నుంచి జిషు సేన్ గుప్తాను తీసుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు పాన్ ఇండియా రేంజ్ లో ఉందని.. అందుకే ఇప్పుడా స్టార్ హీరోను సంప్రదిస్తున్నట్టు వార్త ఫిలిం సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది.
డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడే. ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమాలో కూడా గతంలో నటించారు. ఇప్పుడు ఎన్టీఆర్-కొరటాల సినిమాలో మమ్ముట్టి నటిస్తున్నాడన్న వార్త నిజమైతే ఇన్నాళ్ల తర్వాత మరో తెలుగు స్ట్రెయిట్ సినిమాలో నటిస్తున్నట్టే. అయితే.. ప్రస్తుతానికి ఈ వార్త గాసిప్ గానే ఉంది. దీనిపై పూర్తి అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది. సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీని ఇప్పటికే ఎంపిక చేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్, కొరటాల ఆచార్య సినిమాలు పూర్తవగానే ఈ సినిమా ప్రారంభం కానుంది.