నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా రూపొందనుందా? అవుననే సమాధానం ఇండస్ట్రీ వర్గాల నుండి వినపడుతుంది. పూరి జగన్నాథ్ బాలకృష్ణతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఇది వచ్చే ఏడాదిలోనే ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే బోయపాటి దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఈ సినిమా తర్వాతే పూరి సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఆలోపు పూరి జగన్నాథ్ కూడా విజయ్ దేరవకొండ సినిమాను పూర్తి చేసేస్తాడట. ఇది వరకే బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో `పైసా వసూల్` అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అన్ని అనుకునట్లు కుదిరితే వచ్చే ఏడాది మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా ట్రాక్ ఎక్కుతుంది.
previous post
next post