అమరావతి: ఈ పుస్తకాన్ని చదివిన తరువాత ఏ వ్యక్తి అయినా ప్రకృతి ప్రేమికులుగా దాని రక్షకులుగా మారతారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పర్యావరణానికి హాని కల్గించే యురేనియం తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వివిధ ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు, ప్రకృతి ప్రేమికులను కూడగడుతూ ఆందోళన నిర్వహిస్తున్న జనసేనాని పవన్ బుధవారం సేవ్ నల్లమల ట్యాగ్ లైన్తో తన ట్విట్టర్ ఖాతాలో వనవాసి అనే అనువాద పుస్తకం గురించి ట్వీట్ చేశారు. బవవాసి (తెలుగులో వనవాసి) అనే పుస్తకాన్ని 1938లో భిభూతి భూషణ్ బందోపాధ్యాయ రచించగా దాన్ని సూరంపూడి సీతారాం తెలుగులోకి అనువదించారని పవన్ పేర్కొన్నారు. తాను టీనేజ్లో ఉండగా మద్రాస్ బుక్ ఫెయిర్లో ఆ పుస్తకం కొన్నానని పవన్ వివరించారు. వనవాసి పుస్తకం ప్రకృతిపై తన ప్రేమను మరింత పెంచిందని పవన్ వెల్లడించారు. అంతే కాకుండా జర్మన్ రచయిత పీటర్ వోలెబెన్ రచించిన ‘ది సీక్రెట్ వర్క్ ఆఫ్ నేచర్’ పుస్తకాన్ని కూడా పవన్ ట్వీట్ చేశారు.
ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కోసం అందరూ శ్రద్ధ వహించాలని పవన్ పేర్కొన్నారు.
This book has deepened my love for nature. Any individual after reading this book will turn into a Nature lover and its protector.
— Pawan Kalyan (@PawanKalyan) September 18, 2019