Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి తొలిసారి కలిసి నటించిన చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. మాలయళంలో సూపర్ హిట్టైన `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కాబోతోంది.
ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో ఆ రోజు విడుదల కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే శర్వానంద్ హీరోగా తెరకెక్కిన `ఆడవాళ్ళు మీకు జోహార్లు` సినిమా ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4వ తేదీ కి షిఫ్ట్ అయింది. ఇక తాజాగా భీమ్లా నాయక్ దెబ్బకు మరో కుర్ర హీరో సైతం వెనక్కి తగ్గాడు. అతడే కిరణ్ అబ్బవరం.
రాజావారు రాణిగారు, ఎస్.ఆర్. కళ్యాణమండపం సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్న కిరణ్ మూడో చిత్రం `సెబాస్టియన్ పిసి 524`. జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో నిర్మితమైన ఈ సినిమాలో కోమలీ ప్రసాద్, నువేక్ష హీరోయిన్లుగా నటించారు. బాలాజీ సయ్యపురెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మరియు టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.
ఈ మూవీతో ముచ్చటగా మూడో విజయాన్ని అందుకోవాలని కిరణ్ తెగ ఆరాటపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 25 సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు. కానీ, భీమ్లా నాయక్ బరిలోకి దిగుతుండటంతో.. చేసేదేమి లేక ఈ సినిమాను మార్చి 4వ తేదీకి వాయిదా వేశారు. ఈ విషయాన్ని మేకర్స్ కొద్ది సేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు.
March 4th 🔥🤗❤️
Ready for encounter !!! #SebafromMarch4th #sebastianpc524 pic.twitter.com/1glH7WBSjr
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 20, 2022