Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటించగా.. పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జిఎమ్బి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మితమైన ఈ మూవీకి తమన్ స్వరాలు అందించాడు.
సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్న ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడి.. చివరాఖరకు మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. తొలి రోజు టాక్ కాస్త తేడా వచ్చినా.. ఆ తర్వాత మైత్రీ వారు చేసిన ప్రమోషన్స్తో ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో మహేశ్ ఖాతాలో వరసగా మరో హిట్ వచ్చి పడింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే తాజాగా మహేశ్ విదేశాలకు పయనమయ్యారు. ప్రతి సినిమా షూటింగ్ కి ముందు, విడుదల తర్వాత మహేష్ తప్పనిసరిగా ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్తుంటాడు. ఈ నేపథ్యంలోనే సర్కారు వారి పాట విడుదలై మంచి విజయం సాధించడంతో.. మహేశ్ భార్య నమ్రత, కూతురు సితార, కుమారుడు గౌతమ్తో కలిసి సమ్మర్ వెకేషన్కు వెళ్లారు.
వెకేషన్ కి వెళుతున్న మహేష్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఇక ఇది లాంగ్ ట్రిప్ అని తెలుస్తుంది. ఈ ట్రిప్ పూర్తైన వెంటనే మహేశ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయనున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించబోతోంది.
Superstar @urstrulyMahesh off to a family holiday ✈️#MaheshBabu #NamrataShirodkar #Gautam #Sitara #SarkaruVaariPaata #SVP pic.twitter.com/uVmDQEu7un
— #BlockbusterSVP 🌟 (@SSMBSpace) May 22, 2022