SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రమే `సర్కారు వారి పాట`. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా.. సముద్రఖని విలన్గా చేశారు. మ్యూజిక్ సెన్షేషన్ తమన్ సంగీతం అందించారు. మే 12న విడుదలైన ఈ మూవీ నెగటివ్ టాక్ ను అధిగమించి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో మాస్ జాతర సృష్టిస్తోంది.
దీంతో మహేష్ బాబు ఖాతాలో మరో హిట్ పడగా.. లాంగ్ గ్యాప్ తర్వాత కీర్తి సురేష్ ఈ మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. అయితే బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్తో సక్సెస్ ఫుల్గా రన్ అవుతున్న ఈ చిత్రానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఈ మూవీలో ఓ డైలాగ్ వివాదానికి తెర లైపింది. అసలేం జరిగిందంటే..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ చిత్రంలో విలన్ గా చేసిన సుముద్ర ఖని ఓ సన్నివేశంలో.. `సింహాచలంలో నరసింహస్వామిని ఏడాదంతా చందనంతో కప్పి ఉంచుతారు. ఎందుకో తెలుసా.. ఆయన నిజ స్వరూపం భయంకరంగా ఉంటుంది. చూస్తే తట్టుకోలేరు` అని చెబుతారు. అయితే ఈ డైలాగ్ పై నరసింహస్వామి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దేవుడిని కించపరిచారంటూ సర్కారు వారి పాట టీమ్పై మండిపడుతున్నారు. దీంతో వెంటనే స్పందించిన డైరెక్టర్ పరశురామ్ క్షమాపణాలు చెప్పారు. `తాను నరసింహస్వామికి పెద్ద భక్తుడినని, ‘సర్కారు వారి పాట’ సినిమాను ప్రారంభించే ముందు కూడా స్వామి వారిని దర్శించుకున్నానని ఆయన తెలిపారు. సినిమాలో డైలాగ్ను కావాలని పెట్టలేదని, ఒకవేళ ఆ విషయంలో భక్తుల మనో భావాలు దెబ్బ తిని ఉంటే క్షమించాలని కోరారు. ఇక్కడతో మరి ఈ వివాదం సద్దుమనుగుతుందా..లేదా.. అన్నది చూడాలి.