`బాహుబలి`లో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అని రెండు పాత్రలు పోషించాడు ప్రభాస్. ఆయన సతీమణి దేవసేన పాత్రలో అందరినీ మెప్పించింది అనుష్క. ఇప్పుడు వీరిద్దరినీ మరోసారి తన సినిమా కోసం సంప్రదించారట జక్కన్న. తెలుగు ఇండస్ట్రీ జక్కన్న అని ముద్దుగా పిలుచుకునేది రాజమౌళినే. ఆయన తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలతో ప్రభాస్, అనుష్క పేరు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. వీరిద్దరూ పాన్ ఇండియా ఆర్టిస్టులు అయ్యారు. ప్రభాస్ `సాహో` హిందీలోనూ విడుదల కానుంది. మరోవైపు అనుష్క కూడా మల్టీ లింగ్వుల్ సినిమాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్, అనుష్క ఇద్దరినీ తన `ఆర్ ఆర్ ఆర్` లో నటించడానికి ఆహ్వానించారట రాజమౌళి. వీరిద్దరు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. చారిత్రక పురుషులను దృష్టిలో ఉంచుకుని రాసుకున్న ఫిక్షనల్ కథతో ఈ సినిమా రూపొందుతోంది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. అత్యధికంగా రూ.300 కోట్ల బడ్జెట్తో సినిమా రూపొందనుంది. ఇప్పటికే వర్క్ షాప్లు పూర్తయ్యాయి. షూటింగ్ ఫాస్ట్ పేస్లో ఉంది.
previous post
next post