Prabhas: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ విషయంలో తీసుకున్న నిర్ణయాలు అటు రాజకీయంగా ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానం.. బెనిఫిట్ షోలు లేకుండా… ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. టికెట్ ధరలు అమాంతం తగ్గించడంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు… ఈ రకమైన టికెట్ ధరలు ప్రభుత్వాలు నిర్ణయిస్తే.. భవిష్యత్తులో సినిమాలు నిర్మించే పరిస్థితి ఉండదని చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు ప్రొడ్యూసర్లు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు(High Court)లో సవాలు చేయడం.. ఆ తర్వాత గెలవటం తెలిసిందే.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా నిబంధనలు ఉల్లంఘించి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న థియేటర్ల పై ఏపీ ప్రభుత్వం రెవెన్యూ అదే రీతిలో పోలీస్ శాఖ అధికారులతో దాడులు నిర్వహించి పలు థియేటర్లు సీజ్ చేయడం జరిగింది. కాగా పంచాయితీ మండలం కార్పొరేషన్ మున్సిపాలిటీ.. భాగాలుగా విభజిస్తే ఆ ప్రాంతాలలో ఉండే సినిమా థియేటర్లకు టికెట్ రేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ తరుణంలో నెల్లూరు జిల్లాలో సూళ్లూరు(Sulluru Pet)పేట లో ప్రభాస్(Prabhas) ఫ్రెండ్స్ భారీ మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించటం తెలిసిందే. అంతేకాకుండా సాహో(Sahoo) సినిమాని ఫస్ట్ టైం రిలీజ్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
40 కోట్లతో నిర్మించిన ఈ ధియేటర్ ఇండియా లోనే బిగ్గెస్ట్ స్క్రీన్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. మూడో అతిపెద్ద బిగ్ స్క్రీన్ థియేటర్. జీవో నెంబర్ 35 పరంగా టికెట్ రేట్ 30 రూపాయలకు పడిపోవడంతో అంతకుముందు రెండు వందలు వందలు రూపాయలు ఉండే పరిస్థితి ఉన్న తరుణంలో… ప్రస్తుత ధరను బట్టి సినిమా ధియేటర్ రన్ చేసే అవకాశం లేదని థియేటర్ పై 40 మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని.. ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని రాష్ట్ర ఆలోచించాలని ప్రభాస్ ఫ్రెండ్షిప్ థియేటర్ నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు టికెట్లు అమ్మితే కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించని పరిస్థితి ఏర్పడుతుందని అందువల్లనే స్వచ్ఛందంగా థియేటర్ మూసివేస్తున్నట్లు తాజాగా థియేటర్ నిర్వాహకులు తెలిపారు. గ్రామపంచాయతీ లో ఈ థియేటర్ ఉండటంతో ధరలో తగ్గించడంతో.. థియేటర్ పనిచేసే అవకాశం ప్రస్తుత పరిస్థితిలో లేదని దయచేసి ఏపీ ప్రభుత్వం.. ఈ విషయంలో పునరాలోచించాలని థియేటర్ నిర్వాహకులు కోరారు.