ప్రభాస్ పక్కన గెలుపు వచ్చి నిలుచుంది. `బాహుబలి` సక్సెస్ మీదున్న ఆయనకు రియల్లైఫ్లోనూ సక్సెస్ వచ్చింది. రాయదుర్గం పన్మక్త్ గ్రామంలో అతనికున్న భూమి పట్ల హైకోర్టు అతనికి సానుకూలంగా తీర్పు చెప్పింది. ఆ భూముల నుంచి ప్రభాస్ను ఖాళీ చేయించడం వీలుకాదని స్పష్టం చేసింది. రెగ్యులరైజేషన్ చేయాలని, అది కూడా ఎనిమిది వారాల్లో ఆ విషయాన్ని తేల్చాలని చెప్పింది. ప్రభుత్వం భూములను రెగ్యులరైజేషన్ చేయడం వల్ల చాలా లబ్ది పొందవచ్చని సూచించింది. ఈ మేరకు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావుతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. 1958 నుంచి అక్కడ భూములపై వివాదం ఉన్న సంగతిని కూడా ఈ ధర్మాసనం గుర్తుచేసింది. కోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభాస్ ఊపిరి పీల్చుకున్నారు. రెగ్యులరైజేషన్ ఫీజును చెల్లించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. తాజాగా ఆయన `సాహో` సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత చేయబోయే సినిమా కూడా ఇప్పటికే కొంత చిత్రీకరణను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
ReplyForward |