అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండేపై ఓ నిర్మాత తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళ్తే.. విజయ్ ఆంటోని, అరుణ్ విజయ్ కాంబినేషన్ నవీన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `అగ్నిసిరగుగల్`. ఈ చిత్రాన్ని తెలుగులో `జ్వాల` పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా 30 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. సినిమా చిత్రీకరణ దశలో ఉన్న సమయంలోనే షాలినికి బాలీవుడ్లో అవకాశం దక్కింది. దీంతో అమ్మడు ముంబై వెళ్లిపోయింది. షూటింగ్ రావాలని దర్శక నిర్మాతలు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా స్పందించడం లేదట. సినిమా సగంలో వెళ్లిపోతే తనకు కోట్లలో నష్టం వస్తుందని నిర్మాత భావించి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడని సమాచారం. బాలీవుడ్లో అవకాశం వస్తే వెళ్లడం మంచిదే. కానీ షూటింగ్ మధ్యలోనే సినిమాను వదిలేసి వెళ్లిపోవడం బాలేదని సినీ వర్గాల అనుకుంటున్నాయి.
previous post
next post