Sai Pallavi: 2017లో విడుదలైన `ఫిదా` మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టి, తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి ఎక్స్పోజింగ్, గ్లామర్ షో చేయకపోయినా.. తన సహజమైన నటన, డ్యాన్స్తోనే స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుందీ బ్యూటీ.
తమిళనాడులో జన్మించినా అచ్చ తెలుగు అడపిల్లలా భారీ స్థాయిలో ఫాలోయింగ్ను సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలెను సైతం షేర్ చేసుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలోనే పెళ్లి, పిల్లలపై తమ మనసులో ఉన్న గుట్టంతా విప్పింది. అసలేమైందంటే.. ఇంటర్వ్యూలో `మన తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటారా..?` అనే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆమె బదులిస్తూ.. `నేను ఇంట్లో తెలుగులోనే మాట్లాడుతుంటా, దాంతో మా నాన్న తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకోమని అంటుంటారు. అసలు నాకు 23 ఏళ్లకే పెళ్లి అయిపోతుంది, 30 ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలు పుట్టేస్తారు అని అనుకున్నా, కానీ, అలా జరగలేదు` అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే సినిమాల్లో స్కిన్ షో చేయడం, పొట్టి బట్టలు వేసుకోవడం తనకు సౌకర్యవంతంగా ఉండదని, అందుకే వాటికి దూరంగా ఉంటానంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్గా మారాయి. కాగా, సినిమాల విషయానికి వస్తే.. సాయి పల్లవి త్వరలోనే `విరాటపర్వం`తో ప్రేక్షకులను పలకరించబోతోంది. రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.