Pranitha: ప్రముఖ హీరోయిన్ ప్రణీత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్న్యూస్ను ప్రణీత స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అలాగే పొత్తిళ్లలో తన బిడ్డను చూసుకుంటూ ఉన్న ఫొటోతో పాటు వైద్యులతో దిగిన పలు ఫొటోలు ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.
`నాకు ఆడబిడ్డ జన్మించింది. నేను గైనకాలజిస్ట్ అయిన తల్లిని కలిగి ఉండటం ఎంతో అదృష్టం, కానీ ఆమెకు ఇది మానసికంగా కష్టతరమైన సమయం. డాక్టర్ సునీల్ ఈశ్వర్, అతడి టీమ్ డెలివరీ సవ్యంగా జరిగేలా చూశారు. అలాగే ఈ ప్రక్రియ సాధ్యమైనంత తక్కువ బాధాకరంగా ఉండేలా చూసుకున్న డాక్టర్ సుబ్బు, అతడి బృందానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు.` అంటూ తన ఇన్స్టా పోస్ట్కు రాసుకొచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ప్రణీత పెట్టిన పోస్ట్, ఆమె షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. అయితే ఈ పిక్స్లో పాప ముఖం కనిపించకుండా ప్రణీత జాగ్రత్త తీసుకుంది. కాగా, కన్నడకు చెందిన ప్రణీత.. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. `ఏం పిల్లో.. ఏం పిల్లడో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. ఇక్కడ చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఈమె 2021లో నితిన్ రాజు అనే వ్యాపారవేత్తని గప్చుప్గా పెళ్లి చేసుకుంది. వీరిది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాగా.. ఏప్రిల్ నెలలో ప్రణీత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టేసింది. తాజాగా ఈమె తల్లి అవ్వడంతో.. అభిమానులు, సినీ ప్రముఖులు మరియు నెటిజన్లు ప్రణీతకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
https://www.instagram.com/p/CeoKSGXscjx/?utm_source=ig_web_copy_link