Prabhas: బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఇప్పుడు ప్రభాస్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు తెగ పోటీ పడుతున్నారు. కాగా.., రెబల్ స్టార్ మాత్రం తన స్థాయికి తగ్గ ప్రాజెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ ముందుకి పోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా లవ్ స్టోరీ తో అభిమానుల ముందుకు రానున్నాడు ప్రభాస్. ఇక రాధేశ్యామ్ సినిమా తరువాత.. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కే, స్పిరిట్ ఇలా వరుస సినిమాలు క్యూలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ బడా నిర్మాత అశ్వినిదత్ హీరో ప్రభాస్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు రెబల్ స్టార్ ఫాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
Mahesh Babu: వాళ్ళ అన్న కోసం షూటింగ్ మధ్యలోనే మహేష్ అలా చేసాడంట కొత్త విషయం బయటపెట్టిన త్రివిక్రమ్..!!
Prabhas: ప్రాజెక్ట్ k తర్వాత పెరగనున్న ప్రభాస్ రేంజ్..
ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K అనే సినిమా తెరకెక్కనుంది. మహానటి లాంటి అద్భుతమైన చిత్రం తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ చిత్రం ప్రభాస్ అభిమానులకి పిచ్చేక్కిస్తుందని అంటున్నారు ఆ సినిమా ప్రొడ్యూసర్ అశ్వినీదత్. ఈ సినిమాను నేషనల్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆ సినిమా మేకర్స్. కాగా తాజాగా నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ.. బాహుబలి, సాహో సినిమాల తర్వాత హాలీవుడ్ దర్శకులు సైతం ప్రభాస్ తో సినిమా తీయడానికి ఎదురుచూస్తున్నారు అని, అంతేకాకుండా ప్రాజెక్ట్ K సినిమా తర్వాత రెబల్ స్టార్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.
Ice Tea: ఐస్ టీ టెస్ట్ చేశారా..!? తయారీ.. లాభాలు ఇవిగో..!!
ఆశ్చర్యం అవసరం లేదు..
ప్రభాస్ ఇమేజ్ కి ముందు ముందు ఇక ప్రభాస్ అన్ని హాలీవుడ్ చిత్రాలే చేసినా కూడా ఎవ్వరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, ప్రాజెక్ట్ K సినిమాలో అమితాబ్, దీపికా పదుకొణె లాంటి పెద్ద పెద్ద నటీనటులు నటిస్తున్నారు.