Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు ఇటీవల మరణించడం తెలిసిందే. సొంత అన్నయ్య చనిపోవటం మరోపక్క కరోన రావడంతో మహేష్.. చివరి చూపు చూడలేకపోయాడు. ఈ తరుణంలో నాలో సగం నువ్వు అన్నయ్య… నేనెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.. అంటూ ఎమోషనల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. కెరియర్ పరంగా మహేష్ కి .. వెన్నెముక మాదిరిగా సొంత అన్నయ్య రమేష్ ఉండేవారని చాలామంది సన్నిహితులు చెబుతుంటారు. మహేష్ కూడా చాలా సందర్భాలలో ఈ విషయం తెలియజేయడం జరిగింది.
రమేష్ బాబు కూడా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన గాని.. అంతగా క్లిక్ కాలేదు. కానీ తాజాగా మహేష్ కి తన అన్న పై ఉన్న ప్రేమను తెలియజేస్తూ త్రివిక్రమ్ కొత్త విషయాన్ని.. బయటపెట్టినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. మేటర్ లోకి వెళ్తే “ఖలేజా సినిమా జరుగుతున్న సమయంలో… షూటింగ్ మధ్యలో ఫోన్ రావడం జరిగిందట. ఆ ఫోన్ మాట్లాడక మహేష్ బాబు చాలా నీరసంగా పక్కకు వెళ్ళిపోయాడు.
దీంతో వెంటనే మహేష్ దగ్గరికి వెళ్లి మాట్లాడగా అన్నయ్య కి జ్వరం… హాస్పిటల్లో ఉన్నారు…అంటూ చాలా బాధపడ్డాడు ఆ టైంలో షూటింగ్ ఆపేద్దామని తెలియజేసిన గాని పెద్ద నిర్మాత కావడంతో ఆ రోజు షెడ్యూల్ పూర్తి చేసి కారు తీసి.. నేరుగా హాస్పిటల్ కి వెళ్లి పోయాడు. అన్నయ్య అంటే అంత ప్రాణం మహేష్ కి..అంటూ.. కొత్త విషయాలు త్రివిక్రమ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మహేష్ “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో వచ్చిన “అతడు”, “ఖలేజా” సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో ప్రెజెంట్ వస్తున్న మూడో సినిమా పై అంచనాలు విపరీతంగా ఉన్నాయ్.