దేశవ్యాప్తంగా ఎంతో వ్యతిరేకతకు గురైన మద్యం అమ్మకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. ఒకపక్క కరోనా బారిన పడి ప్రజలంతా అలాడిపోతుంటే ఈ సమయంలో మందు షాపులు తెరవడం వల్ల ఆ వ్యాధిని మరింత వ్యాపించినవారు అవుతారని ప్రభుత్వాలపై ప్రజలు విరుచుకు పడుతుంటే జగన్ మాత్రం వ్యూహాత్మకంగా వేసిన అడుగులు ఇప్పుడు పలు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
ఒక్కసారిగా మద్యం పెంచడం వల్ల మందు తాగే వాళ్ళ సంఖ్య మెల్లగా తగ్గిపోతుంది అన్న జగన్ ఆలోచనలను ప్రతిపక్ష నేతలు ఎంత ఎగతాళి చేశారో అందరికీ తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో నుండి రిపోర్టులు వచ్చాక వారి ఆరోపణల్లో మరియు విమర్శల్లో ఎటువంటి పస లేదు అన్న విషయం స్పష్టంగా అర్థం అయిపోయింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపు లతో రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం షాపులను తెరిచారో.. మందుబాబులు అంతా ఒక్కసారిగా మద్యం షాపుల పై ఎగబడ్డారు.
అయితే మొదటి రోజు జగన్ అప్పటి ధరలపై 25 శాతం అదనంగా పెంచగా…. రెండవ రోజుకు మరో 50 శాతం పెంచారు. అలా లాక్ డౌన్ ముందు ఉన్న ధరలతో పోలిస్తే ఒక్కసారిగా 75% ధరలను ప్రభుత్వం పెంచేసింది. ఈ విషయం ఎలా ఉన్నా జనాలు షాపుల ముందు మీద మీద పడి మ్ద్యం కొనుగోలు చేయడంతో సామాజిక దూరం సాధ్యం కాలేదు. అయితే కొద్దిరోజులుగా మద్యం షాపుల దగ్గర జనాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఆశ్చర్యకరంగా నాలుగవ రోజు నుండే రాష్ట్రంలోని మెజారిటీ మద్యం షాపుల ముందు క్యూలు కనిపించలేదు.
లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా 4వ తేదీన రాష్ట్రం మొత్తం మీద 70 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. తర్వాత మరో నాలుగు రోజులు పర్వాలేదనుకున్న అమ్మకాలు మొన్నటి 9వ తేదీన బాగా పడిపోయింది. 9వ తేదీన 41 కోట్ల విలువైన మద్యం మాత్రమే అమ్ముడైంది. అంటే 4వ తేదీ నుండి చూస్తే 9వ తేదీకి 30 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు పడిపోయాయని లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 10వ తేదీ లెక్కలు రావాల్సుంది. మొత్తం మీద ధరలు పెంచేసి మందుబాబులకు షాక్ ఇవ్వాలన్న జగన్ ప్లాన్ సక్సెస్ అవుతున్నట్లే అనిపిస్తోంది.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!