Janhvi Kapoor: దివంగత నటి శ్రీదేవి – ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ దంపతుల కుమార్తె జాన్వీ కపూర్ ను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తల్లి బాటలోనే ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన జాన్వీ కపూర్.. 2018లో ధడక్ మూవీతో హీరోయిన్గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది. తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా పలు అవార్డులను అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ ఇప్పటివరకు ఆమె ఖాతాలో కమిర్షియల్ గా ఒక హిట్ కూడా పడలేదు. అయితే నటిగా మాత్రం తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకుంది. అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
ప్రస్తుతం ఈ అమ్మడి చూపు తెలుగు ఇండస్ట్రీపై పడింది. జాన్వీ తల్లి శ్రీదేవిని స్టార్ హీరోయిన్ గా మార్చింది తెలుగు సినిమాలే. ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ కూడా తెలుగు చిత్రాలతో భారీ స్టార్డమ్ సంపాదించుకోవాలని తాపత్రయపడుతుంది. ఇందులో భాగంగానే టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ బ్యూటీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడిగా దేవర సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దేవర మూవీ సెట్స్ మీద ఉండగానే జాన్వీ కపూర్ తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఆమె కమిట్ అయింది. ఆర్సీ16 వర్కింగ్ టైటిల్ తో ఇటీవల ఈ చిత్రం ప్రారంభం అయింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు టాలీవుడ్ లో మరో స్టార్ హీరో ను జాన్వీ కపూర్ మడతెట్టేసిందట. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి జోడిగా జాన్వీ కపూర్ నటించబోతోంది. గుంటూరు కారం అనంతరం మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి తో చేయబోతున్న సంగతి తెలిసిందే.
యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్టోరీ అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ ను వన్ ఆఫ్ ద హీరోయిన్ గా రాజమౌళి ఎంపిక చేశారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. బోనీ కపూర్ చేసిన గట్టి ప్రయత్నం కారణాంగానే జాన్వీ కపూర్ కు మహేష్ సినిమాలో అవకాశం వచ్చిందని కూడా టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా రాజమౌళి-మహేష్ బాబు సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక అయిందంటే ఆమె దశ తిరిగినట్లే అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
https://www.instagram.com/janhvikapoor/?hl=en