Madhuranagarilo April 15 2024 Episode 338: రాధా గుడికి వెళ్లి పండు ఆపరేషన్ కి డబ్బు దొరకాలని పూజ చేయిస్తుంది. పంతులుగారు అర్చన చేసి ఏంటమ్మా అలా ఉన్నావ్ ఏదో కష్టంలో ఉన్నట్టు అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే అని అంటాడు. అవును పంతులుగారు మా అబ్బాయికి ఆరోగ్యం బాగోలేదు ఆపరేషన్ కి ఇరువై ఐదు లక్షలు డబ్బులు ఖర్చు అవుతాయి అన్నారు ఆ డబ్బులు దొరకలేదు మా బాబు ఆపరేషన్ కి డబ్బులు దొరికి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని అమ్మవారికి పూజ చేయిద్దామని వచ్చాను అని రాదా అంటుంది. నీ బాధని ఆ భగవంతుడికి చెప్పావు కదమ్మా నీ కష్టం తీరిపోతుంది మీ బాబు ఆరోగ్యంగా ఉంటాడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు అని పంతులుగారు ఆశీర్వదిస్తారు. కట్ చేస్తే, ప్రసాద్ రావు వాళ్ల పనిమనిషి అదే గుడికి వస్తారు.
రాధా వాళ్ళని చూసి అక్కడికి వెళుతుంది. రాదా ను చూసి ప్రసాద్ రావు ఏంటి రాధ అలా ఉన్నావు అని అడుగుతాడు. మా బాబుకి ఆరోగ్యం బాగోలేదు అంకుల్ అని రాధా చెబుతుంది. మరి మా ఇంటికి రాలేకపోయావా మా డబ్బు సహాయం చేసే వాని కదా అని ప్రసాద్ రావు అంటాడు. వచ్చాను అంకుల్ మీ వాచ్మెన్ నన్ను లోపలికి రానివ్వలేదు మా బాబు ఆపరేషన్ కి పాతిక లక్షలు ఖర్చు అవుతాయి అన్నారు మావారు అందరినీ అడిగి చూసాడు ఎక్కడ డబ్బు దొరకలేదు అని రాదా బాధపడుతుంది. నాకు చెప్పావు కదా అమ్మ నేను చూసుకుంటాను హాస్పిటల్ పేరు ఏంటో చెప్పు అని ప్రసాద్ రావు అంటాడు. కెఎల్ఎమ్ హాస్పిటల్ అని రాదా చెబుతుంది. ప్రసాద్ రావు వెంటనే హాస్పిటల్ కి ఫోన్ చేసి నా పేరు ప్రసాద్ రావు వీరాజ్ గ్రూప్ ఇండస్ట్రీకి చైర్మన్ ని పండు అనే పేషెంట్ కి ఆపరేషన్ కోసం డబ్బు కావాలన్నారంట కదా అతనికి ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు నేను ఆ డబ్బు కడతాను వెంటనే ఆపరేషన్ చేయండి అని ప్రసాద్ రావు అంటాడు.
అక్కర్లేదు సార్ వాళ్ళ డాడీ డబ్బు కట్టేశాడు ఆపరేషన్ కూడా జరుగుతుంది అని అమ్మాయి చెబుతుంది. రాధా మీ ఆయన డబ్బు కట్టేసాడంట పండుకి ఆపరేషన్ కూడా జరుగుతుందంట మీ పండు ఆరోగ్యంగా ఉంటాడు అని ప్రసాద్ రావు అంటాడు. చాలా థాంక్స్ అంకుల్ మా వారు డబ్బులు కట్టారా అయితే నేను హాస్పిటల్ కి వెళ్తున్నాను అంటూ రాధా వెళ్లిపోతుంది. కట్ చేస్తే, రాధా హాస్పిటల్ కి వస్తుంది. అత్తయ్య పండుకి ఆపరేషన్ జరుగుతుందంట కదా డబ్బు ఆయన కట్టేశాడు అంట కదా అని రాదా అంటుంది. అవునమ్మా శ్యామ్ ఎక్కడ నుంచో డబ్బు తెచ్చాడు ఇక పండుకు ఏమీ కాదు నేను టెన్షన్ పడకు శ్యామ్ తన రక్తమిర్చి తనకి పునర్జమని ఇస్తున్నాడు అని మధుర అంటుంది. ఇంతలో డాక్టర్ గారు బయటికి వస్తారు. డాక్టర్ మా పండుకి ఇప్పుడు ఎలా ఉంది వెళ్లి చూడొచ్చా అని రాదా అడుగుతుంది. ఆపరేషన్ సక్సెస్ అయింది గంట తర్వాత ఐసి లో పెడతాం వెళ్లి చూడండి అని డాక్టర్ గారు చెబుతారు. కట్ చేస్తే, ఏమండీ ఇప్పుడు ఎలా ఉంది అని రాధా అడుగుతుంది. కొంచెం నీరసంగా ఉంది రాధ అని శ్యామ్ అంటాడు. చాలా థాంక్స్ రా సమయానికి డబ్బు తెచ్చి పండుని కాపాడావు అని ధనంజయ్ అంటాడు. ఆయనకి కాదు మామయ్య గారు మా అక్కకు కూడా థాంక్స్ చెప్పాలి సమయానికి డబ్బు ఇచ్చి పండుని కాపాడింది అని రాదా అంటుంది.
అవునమ్మా ఎంత దుర్మార్గురాలైనా సమయానికి డబ్బు సహాయం చేసి పండు ప్రాణాలు కాపాడినందుకు థాంక్స్ చెప్పాల్సిందే ఇప్పుడే ఫోన్ చేస్తాను అని ధనంజయ్ అంటాడు. వద్దు మా మామయ్య గారు నేనే వెళ్లి డైరెక్ట్ గా అక్కకి థాంక్స్ చెప్తాను అని రాధా అంటుంది. అక్కడికి రాధ వెళ్తే రుక్మిణి మెడలో తాళి కట్టానని రుక్మిణి చెప్పేస్తుంది రాజకీయ విషయం తెలియకూడదు అనే శ్యామ్ రాధా మీ అక్క డబ్బు సహాయం చేయలేదు మా ఫ్రెండ్స్ అమెరికాలో ఉన్నారని చెప్పాను కదా వాళ్లకి ఫోన్ చేసి అడిగితే కిరణ్ అకౌంట్ లోకి తల కాస్త కొట్టారు కిరణ్ ఆ డబ్బులు డ్రా చేసుకొని తీసుకొస్తే ఆపరేషన్ చేయించాను మీ అక్కకి థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని శ్యామ్ అంటాడు. ఆ దుర్మార్గురాలికి అంత పెద్ద గొప్ప మనసు ఎక్కడిది అనుకున్నాను అప్పుడే అని మదురా అంటుంది. ఎలాగైతేనేం శ్యామ్ మనకు ప్రాణాలతో దక్కాడు అది చాలు అని రాధా సంతోషిస్తుంది. కట్ చేస్తే, ప్రసాద్ రావు స్వీట్ లు అన్ని తెప్పిస్తాడు. ఇన్ని స్వీట్లు ఎందుకు సార్ అని వాళ్ళ పనిమనిషి అడుగుతుంది. రాజి విరాజ్ కి పెళ్లి చేయడం కోసంఅని ప్రసాదు రావు అంటాడు.బాబు గారు అర్జెంటు మీటింగ్ ఉందని వెళ్లారు వస్తారంటారా అని రాజి అంటుంది. ప్రసాద్ రావు ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్తాడు. డాడీ నేను అర్జెంటు మీటింగ్ లో ఉన్నాను ఇప్పుడు రాలేను అని వీరాజ్ అంటాడు.
అయితే ఈ స్వీట్లనే తిని నేను చచ్చిపోతాను వచ్చేటప్పుడు రెండు పూలదండలు తీసుకుని రా అని ప్రసాదు రావు అంటాడు. ఏంటి డాడీ మీరు చెప్తే అర్థం చేసుకోరు అర్జెంటు మీటింగ్ అన్నాను కదా అని విరాజ్ అంటాడు.చూడు విరాజ్ నేను ప్రాణాలతో కావాలి అంటే వెంటనే వచ్చేసేయ్ లేదంటే రెండు దండలు పట్టుకొచ్చి నా ఫోటోకి ఒకటి వెయ్ నా శవానికి ఒకటి వెయ్ అని ప్రసాద్ రావు ఫోన్ కట్ చేస్తాడు. ఇప్పుడు చూడు వాడు ఎలా పరిగెత్తుకొస్తాడు అని ప్రసాద్ రావు అంటాడు. కట్ చేస్తే, రాధా మధుర ధనంజయ్ అందరూ పండు దగ్గరికి వెళ్తారు. పండు ఇప్పుడు ఎలా ఉన్నావ్ నాన్న అని రాదా అడుగుతుంది. బాగానే ఉన్నాను మమ్మీ కొంచెం నీరసంగా ఉంది అని పండు అంటాడు. ఇక నీకు ఎటువంటి భయం లేదు నాన్న నీకు ఆపరేషన్ అయిపోయింది నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అని రాదా అంటుంది.డాక్టర్ పండుని చూసి మీరు చాలా అదృష్టవంతులుఇక మీ అబ్బాయికి ఎటువంటి ప్రమాదం లేదు అనే చెబుతుంది.
చాలా థాంక్స్ డాక్టర్ మా పండుని మాకు ప్రాణాలతో తిరిగి ఇచ్చినందుకు అని రాదా అంటుంది.థాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా మీ ఆయనకి సమయానికి డబ్బు తెచ్చి తన ప్రాణం కాపాడాడుఅని డాక్టర్ చెప్తుంది.చాలా థాంక్స్ అండి సమయానికి డబ్బు తెచ్చి పండు నీ కాపాడారు అని రాదా అంటుంది. మనలో మనకు థాంక్స్ ఎందుకు రాదా అని శ్యామ్ అంటాడు. అలా అనకండి ఎంతో కష్టపడి సమయానికి డబ్బు తెచ్చి పండుని కాపాడారు అని రాదా అంటుంది. పేషెంట్ కండిషన్ అర్థమైంది కదా గంట గంటకి తనకి ఎలా ఉందో నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి అని నర్స్ కు డాక్టర్ చెప్పి వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో రుక్మిణి అక్కడికి వస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!