సినీ పరిశ్రమలో సెలబ్రెటీల పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్. ఒక్కొక్కరు రెండేసి, మూడేసి పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. ఇటీవల కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్వర్య లు విడాకులు తీసుకుని సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
2004 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. 18 ఏళ్ల పాటు కాపురం చేసి, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులై ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే, ఇటీవల వచ్చిన కొన్ని మనస్పర్థల కారణంగా ఈ జంట అనూహ్యంగా విడాకుల వైపు టర్న్ తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. కుటుంబ సభ్యులే కాదు అభిమానులు సైతం ఇప్పటికీ వీరి వేడుకలను జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే భార్యాభర్తలు గా విడిపోయినా.. స్నేహితులు గా కలిసి ఉంటామని ధనుష్ ఐశ్వర్య లు ప్రకటించారు. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ధనుష్-ఐశ్వర్యలు మళ్లీ కలిసిపోబోతున్నారట. వీరిద్దరూ తమ విడాకులను రద్దు చేసుకునేందుకు సైతం సిద్ధమైనట్టుగా ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ధనుష్ ఐశ్వర్యలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం అన్నది తెలియాలంటే వారి నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఒకవేళ నిజంగా ఈ జంట కలిసిపోతే అభిమానులు ఫుల్ ఖుషీ అవ్వడం ఖాయం.