టాలీవుడ్ స్వీట్ కపుల్స్లో మహేశ్ బాబు-నమ్రత జంట ఒకటి. `వంశీ` సినిమాతో మొదలైన వీరి పరిచయం స్నేహంగా మారగా.. ఆ తర్వాత ప్రేమకు దారి తీసింది. ఇరుకుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించడంతో.. 2005లో ఫిబ్రవరి 10న ముంబైలో సైలెంట్గా వివాహం చేసేసుకున్నారు. ఈ దంపతులకు గౌతమ్, సీతరలు జన్మించారు.
వివాహం అనంతరం నమ్రత నటనకు పులిస్టాప్ పెట్టేసి పూర్తి హౌస్ వైఫ్ గా మారిపోయింది. మరోవైపు మహేశ్ బాబు సినీ కెరీర్ మాత్రం నమ్రతను పెళ్లి చేసుకున్నాకే ఊపందుకుంది. సూపర్ స్టార్గా కూడా ఎదిగారు. అయితే మహేష్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. బ్రేక్ తీసుకుని మరీ ఫ్యామిలీతో ఏడాదికి రెండు, మూడు టూర్లు వేస్తుంటారు.
ప్రస్తుతం కూడా మహేశ్.. తన భార్యా పిల్లలతో వరల్డ్ టూర్ లో ఉన్నాడు. దీనిలో భాగంగా రీసెంట్గా వీరు స్విజర్లాండ్ లోని అందమైన ప్రదేశాలను వీక్షిస్తున్నారు. అయితే తాజాగా నమ్రత ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పిక్ను షేర్ చేసింది. అందులో ఆమె భర్త మహేశ్ బాబు కౌగిట్లో బందీగా కనిపించింది.
ఎంతో రొమాంటిక్గా ఉన్న ఈ పిక్కు నమ్రత.. మహేశ్ను ఉద్దేశిస్తూ `మీతో ఎవరినీ పోల్చలేను` అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ పిక్ కాస్త నెట్టింట వైరల్గా మారింది. కాగా, మహేశ్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల `సర్కారు వారి పాట`తో సూపర్ హిట్ను ఖాతాలో వేసుకున్న ఈయన.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను త్రివిక్రమ్తో చేయబోతున్నాడు. ఇది పూర్తైన వెంటనే రాజమౌళితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను పట్టాలెక్కించబోతున్నాడు.
https://www.instagram.com/p/CgrEdONvUYG/?utm_source=ig_web_copy_link